Don't Miss!
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- News Viral Video: రాజకీయ దిగ్గజాల కాళ్లు మొక్కిన టీడీపీ అభ్యర్ధి నిమ్మల..!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఈ సినిమా చేస్తే కొడతారని చెప్పింది.. అందుకే కాజల్కు ఫోన్ చేశా: మంచు విష్ణు
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో మంచు విష్ణు ఒకరు. కెరీర్ లో డీ సినిమా తరువాత ఆ స్థాయిలో ఇంతవరకు బిగ్గెస్ట్ హిట్ అందుకోని మంచు విష్ణు ఎలాగైనా మోసగాళ్ళు సినిమాతో బాక్సాఫీస్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మంచు విష్ణు హోమ్ ప్రొడక్షన్ లో ఈ సినిమాను నిర్మించారు. బిగ్గెస్ట్ మనీ స్కామ్ కు సంబంధించిన రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను గురువారం విడుదల చేశారు. ఇక మంచు విష్ణు సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టాడు.
పాన్ ఇండియా రేంజ్ లో..
మంచు విష్ణు చివరగా 2019లో ఓటర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవ్వలేదు. ఇక ఇప్పుడు ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టాలని మంచు విష్ణు రెడీ అవుతున్నాడు. 50కోట్లకు పైగా ఖర్చు చేసి ఈ సినిమాను తెలుగు ఇంగ్లీష్ లో ఒకేసారి తెరకెక్కించారు.
గత ఏడాది రిలీజ్ కావాల్సిన సినిమా
గురువారం ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి ద్వారా రిలీజ్ చేయించిన మంచు విష్ణు ప్రెస్ మీట్ నిర్వహించి సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. సినిమాను గత ఏడాది జూన్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నామని చెబుతూ లాక్ డౌన్ వల్ల వాయిదా వేయక తప్పలేదని చెప్పారు.
నాకు అంత మార్కెట్ లేదని తెలుసు
విష్ణు మాట్లాడుతూ.. సినిమా స్క్రిప్ట్ పూర్తవ్వగానే ప్రీ ప్రొడక్షన్ దశలో బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుందని అనిపించింది. బడ్జెట్ కొంత పెరిగిందనే చెప్పాలి. నాకు అంత మార్కెట్ లేదని తెలుసు. దాదాపు నా మార్కెట్ కంటే 30% ఎక్కువే అవుతోంది. రిస్క్ అని తెలిసినా కూడా మోసగాళ్ళు సినిమా నా మార్కెట్ పరిధిని బ్రేక్ చేయగలదనే నమ్మకం ఉంది. నిజంగా సినిమా అద్భుతంగా వచ్చిందని.. చెప్పారు.
ఈ సినిమా చేస్తే నన్ను కొడతారు
ఇక సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుతూ.. సినిమాలో సిస్టర్ పాత్రకు మొదట ప్రీతీ జింటాను అనుకున్నాము. కానీ అమెరికాకు సంబంధించిన మనీ స్కామ్ స్టోరీ అనగానే ఆమె నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ సినిమా తీయవద్దు. ఈ సినిమా చేస్తే నన్ను కొడతారు. నా ఫ్యామిలీ మొత్తం యూఎస్ లో ఉంటోందని చెప్పారు. నేను వెంటనే కాజల్ కు ఫోన్ చేయడంతో ఆమె రియల్ స్టోరీ కదా చేస్తే బావుంటుందని వెంటనే ఒప్పేసుకున్నట్లు విష్ణు వివరణ ఇచ్చారు.