Don't Miss!
- News ఎండలో తిరిగితే జ్వరం..పూలు వేస్తే ఎలర్జీ..నీకు రాజకీయాలెందుకు..?
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అన్నా చెల్లెల్లుగా మంచు విష్ణు, కాజల్.. కరోానా సమయంలో ఇలాంటి షాకా?
మంచు విష్ణు కెరీర్ పరంగా ప్రస్తుతం స్లోగానే ఉంది. ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూనే వస్తోంది. చివరగా వచ్చిన ఆచారి అమెరికా యాత్ర కూడా సరైన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. అయితే మంచు విష్ణు ప్రస్తుతం ఓ భారీ ప్రయోగాన్నే చేసేందుకు సిద్దపడ్డాడు. ప్రపంచలోనే భారీ ఐటీ స్కాం నేపథ్యంలో ఓ చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వదిలిన పోస్టర్స్, ఫస్ట్ లుక్స్ ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
మోసగాళ్లు అంటూ..
హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో మోసగాళ్లు తెరకెక్కుతోంది. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ కథతో! అంటూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అర్జున్ పాత్రలో విష్ణు లుక్ అదిరిపోయింది. అయితే కాజల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. కాజల్ అను పాత్రలో నటిస్తోన్నట్టు ప్రకటించారు.
రాఖీ స్పెషల్..
అయితే రాఖీ పౌర్ణమి స్పెషల్గా మోసగాళ్లు నుంచి ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో కాజల్, విష్ణు ఎంతో సరదాగా ముచ్చటిస్తున్నట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా కాజల్ బైక్ నడిపే సాహసం కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. కొత్త పోస్టర్ను రిలీజ్ చేస్తూ మంచు విష్ణు చేసిన కామెంట్ మాత్రం తెగ వైరల్ అవుతోంది.
మంచు విష్ణు రాఖీ విషెస్..
రాఖీ పండుగ సందర్భంగా కొత్త పోస్టర్ను రిలీజ్ చేయగా.. మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ మేరకు హ్యాపీ రాఖీ అంటూ కాజల్ను ట్యాగ్ చేశాడు. మంచు విష్ణు చేసిన పోస్ట్కు కాజల్ కూడా స్పందించింది. అర్జున్ నీకు కూడా హ్యాపీ రాఖీ అని పేర్కొంది. దీంతో ఈ రెండు పోస్ట్లు తెగ వైరల్ అవుతున్నాయి.
Recommended Video
అన్నా చెల్లెల్లా?
అయితే ఈ చిత్రంలో విష్ణు, కాజల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారని ఇంత వరకు అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ రాఖీ విషెస్ చెప్పుకోవడంతో అందరిలోనూ ఓ అనుమానం మొదలైంది. వీరద్దరూ అన్నచెల్లెల్లా పాత్రలను పోషిస్తున్నారా? లేదా మోసగాళ్లు అనే టైటిల్ పెట్టినందుకు అలా ట్రాప్ చేస్తున్నారా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.