Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అన్నా చెల్లెల్లుగా మంచు విష్ణు, కాజల్.. కరోానా సమయంలో ఇలాంటి షాకా?
మంచు విష్ణు కెరీర్ పరంగా ప్రస్తుతం స్లోగానే ఉంది. ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూనే వస్తోంది. చివరగా వచ్చిన ఆచారి అమెరికా యాత్ర కూడా సరైన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. అయితే మంచు విష్ణు ప్రస్తుతం ఓ భారీ ప్రయోగాన్నే చేసేందుకు సిద్దపడ్డాడు. ప్రపంచలోనే భారీ ఐటీ స్కాం నేపథ్యంలో ఓ చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వదిలిన పోస్టర్స్, ఫస్ట్ లుక్స్ ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
మోసగాళ్లు అంటూ..
హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో మోసగాళ్లు తెరకెక్కుతోంది. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ కథతో! అంటూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అర్జున్ పాత్రలో విష్ణు లుక్ అదిరిపోయింది. అయితే కాజల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. కాజల్ అను పాత్రలో నటిస్తోన్నట్టు ప్రకటించారు.
రాఖీ స్పెషల్..
అయితే రాఖీ పౌర్ణమి స్పెషల్గా మోసగాళ్లు నుంచి ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో కాజల్, విష్ణు ఎంతో సరదాగా ముచ్చటిస్తున్నట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా కాజల్ బైక్ నడిపే సాహసం కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. కొత్త పోస్టర్ను రిలీజ్ చేస్తూ మంచు విష్ణు చేసిన కామెంట్ మాత్రం తెగ వైరల్ అవుతోంది.
మంచు విష్ణు రాఖీ విషెస్..
రాఖీ పండుగ సందర్భంగా కొత్త పోస్టర్ను రిలీజ్ చేయగా.. మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ మేరకు హ్యాపీ రాఖీ అంటూ కాజల్ను ట్యాగ్ చేశాడు. మంచు విష్ణు చేసిన పోస్ట్కు కాజల్ కూడా స్పందించింది. అర్జున్ నీకు కూడా హ్యాపీ రాఖీ అని పేర్కొంది. దీంతో ఈ రెండు పోస్ట్లు తెగ వైరల్ అవుతున్నాయి.
Recommended Video
అన్నా చెల్లెల్లా?
అయితే ఈ చిత్రంలో విష్ణు, కాజల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారని ఇంత వరకు అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ రాఖీ విషెస్ చెప్పుకోవడంతో అందరిలోనూ ఓ అనుమానం మొదలైంది. వీరద్దరూ అన్నచెల్లెల్లా పాత్రలను పోషిస్తున్నారా? లేదా మోసగాళ్లు అనే టైటిల్ పెట్టినందుకు అలా ట్రాప్ చేస్తున్నారా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.