Don't Miss!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- News సీట్ల మార్పులో బీజేపీ కొత్త ట్విస్ట్- చంద్రబాబు నిర్ణయం ఏంటి..!!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Sports రోహిత్పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
ఆంజనేయస్వామిగా మంచు విష్ణు ఖరారు?
హైదరాబాద్ : దేనికైనా రెడీ చిత్రంతో చిరకాలం గ్యాప్ తర్వాత హిట్ కొట్టిన మంచు విష్ణు తన తదుపరి ప్రాజెక్టులకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఆయన తండ్రి ప్రధానపాత్రలో చేసే రావణ చిత్రంలో ఆంజనేయ స్వామి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ విషయమై మంచు విష్ణు మాట్లాడుతూ...నాన్న టైటిల్ రోల్ చేయబోతున్న 'రావణ'లో నాకో కేరక్టర్ ఉందని రాఘవేంద్రరావుగారు చెప్పారు. నాకైతే ఆంజనేయస్వామి కేరక్టర్ చేయాలని ఉంది అన్నారు.
అలాగే నలుగురు హీరోలతో స్క్రిప్టు సిద్ధంగా ఉంది. హీరోల రెమ్యూనరేషన్ కాకుండా దానికి రూ. 10 కోట్ల పైగా ఖర్చవుతుంది. మణిశంకర్ డైరెక్టర్. నాతో పాటు మరో ముగ్గురు హీరోలు నటిస్తారు. వాళ్లెవరనేది తర్వాత తెలియజేస్తాం. 'అసెంబ్లీ రౌడీ' రీమేక్ చెయ్యబోతున్నా. పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. అలాగే గోపీమోహన్ కథ ఒకటి ఓకే చేశాం. బాగా నచ్చింది అన్నారు. అయితే ఏది ముందు మొదలవుతుందనే విషయాన్ని ఆయన తెలియ చేయలేదు.
ఇక రావణ విషయానికి వస్తే... రాఘవేంద్రరావు దర్శకత్వంలో త్వరలో త్రీడి రావణాసురుడు గా మోహన్ బాబు కనిపించి మురపించనున్నారు. ఈ విషయాన్ని మోహన్ బాబు స్వయంగా మీడియాకు తెలుపుతూ...రావణుడి ఔన్నత్యాన్ని చెప్పే సినిమా ఇది. ఇంతకుముందు ఎన్టీఆర్, ఎస్వీ రంగారావులాంటి మహా నటులు ఈ పాత్రలో కనిపించారు. వారి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా నా శైలిలో రక్తి కట్టించేందుకు ప్రయత్నిస్తాను. భారత చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తారు. అధునాతన త్రీడీ పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తామని అన్నారు.
వచ్చే సంవత్సరం షూటింగ్ మొదలయ్యే ఈ చిత్రం గురించి దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ ''ఎన్టీఆర్ తరవాత సంభాషణలు ఆ స్థాయిలో పలికే నటుడు మోహన్బాబు. మా ఇద్దరి కలయికలో మంచి చిత్రాలొచ్చాయి. 'రావణ' కూడా అదే స్థాయిలో ఉంటుంది. పూర్తి వివరాలు త్వరలోనే చెబుతామని అన్నారు.మైధలాజికల్ ధ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని రాఘవేంద్రరావు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మోహన్ బాబు తన సొంత బ్యానర్ పై రాయుడుగారికి కోపమొచ్చింది అనే చిత్రం ప్లాన్ చేస్తున్నారు.