twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బెల్లంకొండతో వివాదం... ఏం జరిగిందో వివరించిన మంచు విష్ణు

    By Srikanya
    |

    హైదరాబాద్ :నాగచైతన్య, నాగేశ్వరరెడ్డి కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తానని ఇద్దరికీ బెల్లంకొండ సురేశ్‌ అడ్వాన్స్‌ ఇచ్చారు. అయితే పదినెలలైనా ఆ సినిమా మొదలు పెట్టలేదు. నాగచైతన్య ఇంకో సినిమాకి వెళ్లిపోయాడు. ‘దేనికైనా రెడీ' వంటి హిట్‌ సినిమా తర్వాత నాగేశ్వరరెడ్డి ఆ సినిమాను నమ్ముకొని ఖాళీగా ఉన్నారు. ఆ తర్వాత తన అడ్వాన్స్‌ తిరిగివ్వమని బెల్లంకొండ అడిగితే ‘ఈ పదినెలల కాలం నాకు నష్టపరిహారం ఎవరిస్తారు?' అని నాగేశ్వరరెడ్డి అడిగారు. పెద్దలు కూర్చొని మాట్లాడితే రూ. పది లక్షలు ఇవ్వడానికి ఆయన సిద్ధమయ్యారు. కానీ తనకు రూ. 20 లక్షలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు బెల్లంకొండ.నాగేశ్వరరెడ్డిపై కేసు వేశారు. అంటూ బెల్లంకొండ తో వివాదం గురించి చెప్పుకొచ్చారు మంచు విష్ణు.

    Manchu Vishnu on Bellamkonda Issue


    అలాగే మనోజ్‌తో సినిమా చేస్తానని అతనికి అడ్వాన్స్‌ ఇచ్చారు. అతనితో సినిమా చెయ్యలేదు. తన సినిమా షూటింగ్‌ కోసం మా గంధర్వమహల్‌ సెట్‌ను వాడుకొని, దాని రెంట్‌ ఇవ్వకుండా ‘మనోజ్‌కు అడ్వాన్స్‌ ఇచ్చాను కాబట్టి, అతని వద్ద తీసుకొమ్మ'ని లక్ష్మితో చెప్పారు బెల్లంకొండ.

    తనకు చెప్పి మనోజ్‌కు అడ్వాన్స్‌ ఇవ్వలేదు కాబట్టి, మనోజ్‌తో వ్యవహారం మనోజ్‌తోనే చూసుకొమ్మనీ, గంధర్వమహల్‌ రెంట్‌తో దాన్ని ముడిపెట్టొద్దనీ లక్ష్మి చెప్పింది. అలా ఆ వ్యవహారం వివాదమైంది. బెల్లంకొండ కావాలనుకుంటే ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌లోనో, ‘మా'లోనో ఫిర్యాదు చెయ్యొచ్చు కదా. ఎందుకు చెయ్యలేదు? అని ప్రశ్నించారు మంచు విష్ణు.

    English summary
    Manchu Vishnu talked about Bellamkonda Suresh Issue. He said it's not his issue..it is purely Bellamkonda's Fault.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X