Don't Miss!
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘గరుడ’ రాజమౌళి కాదు, మంచు విష్ణు దక్కించుకున్నాడు!
హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి రూ. 250 కోట్ల బడ్జెట్లో ‘బాహుబలి' మూవీని రెండు భాగాలుగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ తొలి భాగం విడుదల చేసి బాక్సాఫీసు కలెక్షన్లు రూ. 650 కోట్ల వరకు సాధించారు. రెండో భాగం కూడా విడుదలైన తర్వాత అన్నీ కలిపితే ఓవరాల్ పదమూడు వందల కోట్లకుపైగా వసూళ్లు వస్తాయని అంచనా.
కాగా... బాహుబలి తర్వాత రాజమౌళి 'గరుడ' అనే టైటిల్తో సినిమా తీయబోతున్నాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రాజమౌళిని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ‘గరుడ' టైటిల్ను హీరో మంచు విష్ణు ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేశాడు.
విష్ణు తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ‘గరుడ' పేరుని నమోదు చేయించాడు. ఇప్పటి దాకా 'గరుడ' గురించి రాజమౌళి ఏ నాడూ స్పందించలేదు. తాజాగా మంచు విష్ణు 'గరుడ' టైటిల్ రిజిస్టర్ చేయించడంతో.... రాజమౌళి దర్శకత్వంలో ‘గరుడ' తెరకెక్కడం లేదని తేలిపోయింది.
ఇప్పటి వరకైతే మంచు విష్ణు కొత్త సినిమాలేవీ కమిట్ కాలేదు.‘గరుడ' టైటిల్ రిజిస్టర్ చేయించిన మంచు విష్ణు ఈ సినిమాలో తానే నటిస్తాడో? లేక మరెవరినైనా హీరోగా పెట్టి సినిమా నిర్మిస్తాడా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.