Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
మంచు విష్ణు 'సరదా' పడ్డాడు
హైదరాబాద్ :మంచు విష్ణు, సోనారిక హీరో హీరోయిన్లుగా జి.కార్తీక్ రెడ్డి ఓ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టైటిల్ ని దర్శక నిర్మాతలు నేడు ప్రకటించారు. ఆద్యంతం సరదా సరదాగా సాగిపోయే కథ, కథనంతో రూపొందుతున్న ఈ సినిమాకి 'సరదా' అనే టైటిల్ ను ఖరారు చేశారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
దర్శకుడు జి కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఫస్ట్ నుండి ఆఖరి వరకు ప్రేక్షకులను నవ్వించే చిత్రం ఇది. మంచి లవ్ ఫీల్ ఉన్న చిత్రం. నాకు మంచి నిర్మాత, మంచి హీరో దొరికారు. స్వచ్ఛనిచ్చారు. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను మంచి చిత్రం తీసి నిలబెట్టుకుంటాను. హీరో క్యారేక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది.
శుక్రవారం నుండి చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అన్నారు. నిర్మాత పల్లి కేశవరావు మాట్లాడుతూ హైదరాబాద్ , వైజాక్లలో టాకీ సన్నివేశాలను చిత్రీకరణ చేస్తాం. పాటలను ఫారిన్లో షూట్ చేస్తాం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలతో షూటింగ్ పూర్తి చేస్తాం. నాలుగు షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేయడానికి ప్లాన్ చేశాం.
మరో నిర్మాత సోమా విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ ....నువు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా చిత్రం తరువాత తీస్తున్న ప్రొడక్షన్ నెంబర్-2 చిత్రం ఇది. ఇద్దరు హీరోయిన్లు, ఆరు పాటలు ఉన్నాయి. సెంటిమెంట్, కామెడి, యాక్షన్ చిత్రం ఇది. పెద్ద సినిమాగా తీస్తాం. క్వాలిటీ ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చిత్రంగా రూపుదిద్దుబోతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సొనారిక, విజయ్ సి కుమార్ తదితరులు పాల్గోన్నారు.
గడచిన ఈ షెడ్యూల్ లో పబ్ సన్నివేశంలో వచ్చే పోరాట సన్నివేశాలను మాస్టర్ నేతృత్వంలో తెరకెక్కించారు. వీటితోపాటు హీరో హీరోయిన్ లు సహా, పలువురు హాస్యనటులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్రెడ్డి, రవికిషన్, పృథ్వీ, రాజా రవీంద్ర, వెన్నెలకిషోర్, శ్రీనివాస్రెడ్డి తదితరులు ఇతర తారాగణం.