Don't Miss!
- News చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు..!!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాలయ్య వారిని అవమానించినట్లా?...సినిమాను సినిమాలా చూడాలి: మంచు విష్ణు
హైదరాబాద్: బాలకృష్ణ గారు సమరసింహారెడ్డి సినిమా చేసారు.... దానర్ధం రెడ్లంతా ఫ్యాక్షనిస్టులనా? మోహన్ బాబుగారు రాయలసీమ రామన్న చౌదరి సినిమా చేసారు... అంటే అది చౌదరి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి తీసిందా? సినిమాను సినిమాలా చూడాలి.... అంటూ వ్యాఖ్యానించారు మంచు విష్ణు.
మోహన్ బాబుకు కొందరు పిండ ప్రధానం చేయడంపై గురువారం ఆయన నాంపల్లి కోర్టులో ప్రైవేట్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ... పై వ్యాఖ్యలు చేసారు. తాము అన్ని వర్గాల వారిని గౌరవిస్తామని, ఎవరినీ అవమానించే ఉద్దేశ్యం తమకు లేదని స్పష్టం చేసారు.
బ్రతికుండగానే తన తండ్రికి పిండ ప్రధానం చేయడాన్ని ఆయన నీచమైన చర్యగా పేర్కొన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే, అందుకే కోర్టుకెక్కినట్లు వెల్లడించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, అలాంటప్పుడు ఎవరికీ భయ పడాల్సిన అవసరం లేదని మా నాన్న చెప్పారని విష్ణు వెల్లడించారు.
కోర్టులో కేసులు నడుస్తున్నందున బ్రాహ్మణులతో ఏర్పిడిన వివాదంపై ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదని చెప్పిన విష్ణు.... వివాదాలు కావాలని తెచ్చుకోమని, అనుకోకుండా జరుగుతాయని, ఎలాంటి వివాదం అయినా సినిమా వారికి ప్లస్సవుతాయని, ఫ్రీ పబ్లిసిటీ గా ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు.