Don't Miss!
- Sports రోహిత్ శర్మ ప్లేస్లో..!!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
గుండె పోటు రాలేదు: రొటీన్ చెకప్ కోసమే మణిరత్నం ఆసుపత్రికి
హైదరాబాద్: ప్రముఖ ఫిల్మ్ మేకర్ మణిరత్నం మంగళవారం న్యూఢిల్లీలోని ఓ ఆసుపత్రికి వెళ్లడంతో ఆయన గుండెపోటు వచ్చిందంటూ ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని, ఆయన కేవలం రోటీన్ హెల్త్ చెకప్ లో భాగంగానే వెళ్లారని ఆయన సన్నిహితులు స్పష్టం చేసారు. మణిరత్నం పూర్తి ఫిట్ గా ఉన్నారని మద్రాస్ టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాల మణియన్ తెలిపారు.
‘ఓకే బంగారం' విజయం సాధించడంతో మణితర్నం, ఆయన భార్య సుహాసిని ప్రస్తుతం ఢిల్లీలో హాలీడేస్ గడుపుతున్నారు. గతంలో ఆయనకు గుండె పోటు వచ్చిన నేపథ్యంలో రొటీన్ చెకప్ చేయించుకోవాల్సిన సమయం వచ్చింది. సాధారణంగా చెన్నైలో ఉంటే అక్కడే చేయించుకునే వారు. ఆ సమయానికి ఢిల్లీలో ఉండటంతో ఇక్కడే చెకప్ కోసం వెళ్లారు' అని మాల మణియన్ స్పష్టం చేసారు.
గతంలో 2004, 2009 సంవత్సరాల్లో యువ, రావణ్ సినిమాల షూటింగ్ సందర్భంగా మణిరత్నంకు మైనర్ హార్ట్ ఎటాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో అప్పటి నుండి ఆయన రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటున్నారు. రెండు దశాబ్దాల సినీ కెరీర్లో మణిరత్నం పలు అద్భుతమైన చిత్రాలు అందించారు. నాయగన్, మౌనరాగం, రోజా, దిల్ సే, బొంబాయి, గురు లాంటి చిత్రాలు ఇందులో ఉన్నాయి.