twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంగీత పరిశ్రమకు ఇది చీకటి రోజు.. ఎస్పీబీపై మణిశర్మ ఎమోషనల్

    |

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. కోట్ల మంది అభిమానుల్ని ఒంటరి చేసి స్వర్గానికి పయనమయ్యారు. ఆగస్ట్ 5న కరోనా పాజిటివ్ రావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్నా కూడా ఆరోగ్యం మాత్రం కుదుటపడేలేదు. నిన్న సాయంత్రం పరిస్థితి విషమించడంతో నేడు (సెప్టెంబర్ 25) ఒంటి గంట నాలుగు నిమిషాలకు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. ఎస్పీబీ మరణం పట్ల సినీ ప్రముఖులంతా సంతాపాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో మెలోడి బ్రహ్మ మణిశర్మ, రోజా వంటి వారు స్పందించారు.

    'భారత సంగీత పరిశ్రమకు ఇది చీకటి రోజు. మ్యూజిక్ ఎన్‌సైక్లోపీడియా.. నా ఇన్‌స్పిరేషన్.. నా సోదరుడిని కోల్పోయాను. సంగీతాన్ని ఎలా క్రియేట్ చేయాలో ఎంత పర్ఫెక్ట్‌గా చేయాలో నేర్చుకున్నాను. నాకు తెలియన ఓ ప్రపంచాన్ని తెలుసుకున్నాను. ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో ఆయన్నుంచే నేర్చుకున్నాను. నాకోసం నిలబడినందుకు థ్యాంక్స్. మీ వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. నేను మిమ్మల్ని మిస్ కాను ఎందుకంటే మీరు నాలోనే నారక్తంలోనే ఉన్నారు. మీ సోదరుడు అంతకంటే పెద్ద అభిమానిని' అంటూ మణిశర్మ ఎమోషనల్ అయ్యారు.

    Mani Sharma And Roja Condolences to SP BalaSubrahManyam

    'గాన గంధర్వుడు, తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, మా శ్రేయోభిలాషి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి మృతి నన్ను కలిచివేసింది. మా నాన్నగారి స్నేహితుడిగా చిన్నప్పటినుండి మా కుటుంబానికి ఆయన ఆత్మీయులే. వారు లేరన్న నిజం నమ్మడం కష్టంగా ఉంది. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.' అని రోజా పోస్ట్ చేసింది.

    English summary
    Legendary singer SP Balasubrahmanyam (SPB) dies at the age of 74 who got infected due to coronavirus on August 5, 2020. Apart from this On August 5th SP Charan shared a video about sp balasubrahmanyam health condition. He died in Chennai's MGM Hospital.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X