Don't Miss!
- News బీఆర్ఎస్ అస్తిత్వంపై బలంగా కొడుతున్న తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి!!
- Sports సర్ఫరాజ్, ధ్రువ్కు బీసీసీఐ బంపర్ ఆఫర్
- Finance IT News: CEO మైండ్ బ్లాంక్ చేసిన IT ఉద్యోగి.. నెట్టింట పోస్ట్ వైరల్.. ఆ ఒక్క మాటతో..
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
సంగీత పరిశ్రమకు ఇది చీకటి రోజు.. ఎస్పీబీపై మణిశర్మ ఎమోషనల్
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. కోట్ల మంది అభిమానుల్ని ఒంటరి చేసి స్వర్గానికి పయనమయ్యారు. ఆగస్ట్ 5న కరోనా పాజిటివ్ రావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్నా కూడా ఆరోగ్యం మాత్రం కుదుటపడేలేదు. నిన్న సాయంత్రం పరిస్థితి విషమించడంతో నేడు (సెప్టెంబర్ 25) ఒంటి గంట నాలుగు నిమిషాలకు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. ఎస్పీబీ మరణం పట్ల సినీ ప్రముఖులంతా సంతాపాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో మెలోడి బ్రహ్మ మణిశర్మ, రోజా వంటి వారు స్పందించారు.
'భారత సంగీత పరిశ్రమకు ఇది చీకటి రోజు. మ్యూజిక్ ఎన్సైక్లోపీడియా.. నా ఇన్స్పిరేషన్.. నా సోదరుడిని కోల్పోయాను. సంగీతాన్ని ఎలా క్రియేట్ చేయాలో ఎంత పర్ఫెక్ట్గా చేయాలో నేర్చుకున్నాను. నాకు తెలియన ఓ ప్రపంచాన్ని తెలుసుకున్నాను. ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో ఆయన్నుంచే నేర్చుకున్నాను. నాకోసం నిలబడినందుకు థ్యాంక్స్. మీ వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. నేను మిమ్మల్ని మిస్ కాను ఎందుకంటే మీరు నాలోనే నారక్తంలోనే ఉన్నారు. మీ సోదరుడు అంతకంటే పెద్ద అభిమానిని' అంటూ మణిశర్మ ఎమోషనల్ అయ్యారు.
'గాన గంధర్వుడు, తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, మా శ్రేయోభిలాషి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి మృతి నన్ను కలిచివేసింది. మా నాన్నగారి స్నేహితుడిగా చిన్నప్పటినుండి మా కుటుంబానికి ఆయన ఆత్మీయులే. వారు లేరన్న నిజం నమ్మడం కష్టంగా ఉంది. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.' అని రోజా పోస్ట్ చేసింది.