Don't Miss!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సంగీత పరిశ్రమకు ఇది చీకటి రోజు.. ఎస్పీబీపై మణిశర్మ ఎమోషనల్
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. కోట్ల మంది అభిమానుల్ని ఒంటరి చేసి స్వర్గానికి పయనమయ్యారు. ఆగస్ట్ 5న కరోనా పాజిటివ్ రావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్నా కూడా ఆరోగ్యం మాత్రం కుదుటపడేలేదు. నిన్న సాయంత్రం పరిస్థితి విషమించడంతో నేడు (సెప్టెంబర్ 25) ఒంటి గంట నాలుగు నిమిషాలకు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. ఎస్పీబీ మరణం పట్ల సినీ ప్రముఖులంతా సంతాపాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో మెలోడి బ్రహ్మ మణిశర్మ, రోజా వంటి వారు స్పందించారు.
'భారత సంగీత పరిశ్రమకు ఇది చీకటి రోజు. మ్యూజిక్ ఎన్సైక్లోపీడియా.. నా ఇన్స్పిరేషన్.. నా సోదరుడిని కోల్పోయాను. సంగీతాన్ని ఎలా క్రియేట్ చేయాలో ఎంత పర్ఫెక్ట్గా చేయాలో నేర్చుకున్నాను. నాకు తెలియన ఓ ప్రపంచాన్ని తెలుసుకున్నాను. ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో ఆయన్నుంచే నేర్చుకున్నాను. నాకోసం నిలబడినందుకు థ్యాంక్స్. మీ వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. నేను మిమ్మల్ని మిస్ కాను ఎందుకంటే మీరు నాలోనే నారక్తంలోనే ఉన్నారు. మీ సోదరుడు అంతకంటే పెద్ద అభిమానిని' అంటూ మణిశర్మ ఎమోషనల్ అయ్యారు.
'గాన గంధర్వుడు, తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, మా శ్రేయోభిలాషి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి మృతి నన్ను కలిచివేసింది. మా నాన్నగారి స్నేహితుడిగా చిన్నప్పటినుండి మా కుటుంబానికి ఆయన ఆత్మీయులే. వారు లేరన్న నిజం నమ్మడం కష్టంగా ఉంది. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.' అని రోజా పోస్ట్ చేసింది.