Don't Miss!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
ఆ కథ మీద ఏడేళ్లుగా పని చేస్తున్నాడు
ముంబై: మణిరత్నం ఓ కథని నమ్మితే అందుకోసం చాలా శ్రమస్తూంటారని ఆయనతో పనిచేసిన వాళ్లు చెప్తూంటారు. రీసెంట్ గా ఆయన ఓ కథ మీద గత ఏడేళ్లుగా పనిచేస్తున్నారు. మణిరత్నం కోసం మరో దర్శకుడు రెన్సిల్ డిసిల్వా పనిచేయనున్నారు. ఇద్దరూ కలిసిన ఈ ప్రాజెక్ట్ ఓ బయోపిక్ కోసం. ఇంతకీ ఎవరి జీవిత కథ? అది మాత్రం సస్సెన్స్. ఈ కథ మీద వీళ్లిద్దరూ కలిసి ఏకంగా ఏడేళ్ల నుంచి పని చేస్తున్నారు.
రెన్సిల్ గతంలో 'రంగ్ దే బసంతి', 'కుర్బాన్', 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', 'ఉంగ్లీ' సినిమాలకు స్క్రిప్ట్ రూపొందించారు. బయోపిక్ కోసం రెన్సిల్ రాసిన స్క్రిప్ట్ మణిరత్నంకు తెగ నచ్చేసింది. దాంతో ఆయన్నే దర్శకత్వం వహించమని కోరారు.
'మేమిద్దరం కలిసి 2007 నుంచి ఈ పని మీద ఉన్నాం. ఇది క్రీడాకారుడికో, సమరయోధుడికో సంబంధించిన జీవిత కథ కాదు. నిరుపేద స్థితి నుంచి సంపన్నుడిగా మారిన ఓ వ్యక్తి కథ. అతడొక పెద్ద కంపెనీని స్థాపించి ఎదిగాడు' అని రెన్సిల్ చెబుతున్నారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్లతో 2010లో 'రావణ్' తీసిన తర్వాత మణిరత్నం తదుపరి చిత్రం ఇదే అవుతుంది.