twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనీషా కొయరాల ఆరోగ్య వివరాలపై నియంత్రణ

    By Srikanya
    |

    ముంబై: మనీషా కొయిరాలా ముంబయిలోని జస్లోక్‌ ఆస్పత్రిలో ఇటీవలే చికిత్స తీసుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే ఆమె తదుపరి చికిత్స కోసం కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళుతున్నారని సమాచారం. ఇంతకీ ఆమెకు తలెత్తిన ఆరోగ్య సమస్య మీద కచ్చితమైన సమాచారం ఏదీ బయటకు రావట్లేదు. ఆస్పత్రి వర్గాలు చెబుతున్న దాని ప్రకారం... 'మనీషా తన ఆరోగ్య పరిస్థితి గురించి బయటకు చెప్పొద్దని కోరారు. అందుకే మేం కూడా వివరాలు వెల్లడించడం కుదరదు'అని తేల్చారు.

    బాలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం మనీషా ఇటీవల నేపాల్ వెళ్లినప్పుడు అన్‌కాన్సియస్(చలనం లేని స్థితి)అయి పడిపోయారని, ముంబైలోని జాస్లోక్ ఆసుపత్రిలో చేరగా ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి. కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని మనీషా కొయిలారా సన్నిహితులు అంటున్నారు. వైద్యులు ఆమెకు పలు రకాల టెస్టులు నిర్వహించారని, టెస్టు రిపోర్టులు వచ్చిన తర్వాత అంతా షాకయ్యారని వెల్లడించారు.

    అయితే మీడియాలో మనీషా కొయరాల కేన్సర్‌ బారిన పడ్డట్లు వార్తలొచ్చాయి. దీనిపై మనీషా కుటుంబ సభ్యులెవరూ స్పందించలేదు. 1991లో 'సౌదాగర్‌'తో వెండి తెరకు పరిచయమైన ఈ నేపాలీ భామ అటు బాలీవుడ్‌, ఇటు దక్షిణాది చిత్రాల్లో నటించారు. 2010లో నేపాల్‌కి చెందిన సామ్రాట్‌ దహాల్‌ని పెళ్లి చేసుకొన్న తరవాత కొన్నాళ్లు తెరకు దూరమయ్యారు. ఇటీవలే రామ్‌గోపావల్‌ వర్మ తీసిన 'భూత్‌ రిటర్న్స్‌'తో మళ్లీ ముఖానికి రంగేసుకొన్నారు.

    English summary
    Manisha Koirala barred doctors to divulge details of her illness. "Manisha was discharged on Friday morning. She has requested not to disclose anything about her health...so I am not allowed to speak about it," Krishnakant Dasyam, spokesperson of Jaslok Hospital, told..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X