Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మనీషా కొయరాల ఆరోగ్య వివరాలపై నియంత్రణ
బాలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం మనీషా ఇటీవల నేపాల్ వెళ్లినప్పుడు అన్కాన్సియస్(చలనం లేని స్థితి)అయి పడిపోయారని, ముంబైలోని జాస్లోక్ ఆసుపత్రిలో చేరగా ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి. కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని మనీషా కొయిలారా సన్నిహితులు అంటున్నారు. వైద్యులు ఆమెకు పలు రకాల టెస్టులు నిర్వహించారని, టెస్టు రిపోర్టులు వచ్చిన తర్వాత అంతా షాకయ్యారని వెల్లడించారు.
అయితే మీడియాలో మనీషా కొయరాల కేన్సర్ బారిన పడ్డట్లు వార్తలొచ్చాయి. దీనిపై మనీషా కుటుంబ సభ్యులెవరూ స్పందించలేదు. 1991లో 'సౌదాగర్'తో వెండి తెరకు పరిచయమైన ఈ నేపాలీ భామ అటు బాలీవుడ్, ఇటు దక్షిణాది చిత్రాల్లో నటించారు. 2010లో నేపాల్కి చెందిన సామ్రాట్ దహాల్ని పెళ్లి చేసుకొన్న తరవాత కొన్నాళ్లు తెరకు దూరమయ్యారు. ఇటీవలే రామ్గోపావల్ వర్మ తీసిన 'భూత్ రిటర్న్స్'తో మళ్లీ ముఖానికి రంగేసుకొన్నారు.