twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేన్సర్ వ్యాధితో ఆసుపత్రిలో చేరిన మనీషా కొయిరాలా

    By Bojja Kumar
    |

    ముంబై: ఒకప్పటి స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలా కేన్సర్ వ్యాధి భారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. బాలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఇటీవల నేపాల్ వెళ్లినప్పుడు అన్‌కాన్సియస్(చలనం లేని స్థితి)అయి పడిపోయారని, ముంబైలోని జాస్లోక్ ఆసుపత్రిలో చేరగా ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి.

    కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని మనీషా కొయిలారా సన్నిహితులు అంటున్నారు. వైద్యులు ఆమెకు పలు రకాల టెస్టులు నిర్వహించారని, టెస్టు రిపోర్టులు వచ్చిన తర్వాత అంతా షాకయ్యారని, జస్లోక్ ఆసుపత్రిలోనే ఆమె కేన్సర్ వ్యాధికి చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకుందని వెల్లడించారు.

    నేపాల్‌కు చెందిన మనీషా కొయిరాలా 1991లో 'సౌదాగర్' అనే చిత్రం ద్వారా భారతీయ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. తన అంద చందాలు, నటనా నైపుణ్యంతో అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ మనీషా కొయిరాలకు అవకాశాలు వెల్లువెత్తాయి. వయసు పైబడ్డాక సినిమా అవకాశాలు తగ్గడంతో నేపాల్ చెందిన వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని అతనితో పొసగక విడిపోయింది.

    కెరీర్ సరిగా లేక పోవడం, పర్సనల్ లైఫ్ సమస్యలతో బాగా సఫర్ అయిన మనీషా.... ఆ మధ్య మద్యానికి బానిసైంది. ఆమె అనారోగ్యానికి ఈ అల వాటుకు కూడా కారణం అని అంటున్నారు. మనీషా చివరి సారిగా నటించిన సినిమా ఇటీవల రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'భూత్ రిటర్న్స్'.

    English summary
    B Town actress Manisha Koirala was hospitalized on Wednesday after reportedly falling unconscious. Was admitted to Jaslok Hospital on Pedder Road on Tuesday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X