Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
షాక్: మనీషా కొయరాలా కొత్త రూపం(ఫోటో ఫీచర్)
ముంబై : గర్భాశయ కేన్సర్తో పోరాటంలో విజయం సాధించిన బాలీవుడ్ అందాల తార మనీషా కొయిరాలా తన తాజా రూపంతో ఉన్న ఫొటోలను ట్వీట్ చేసింది. మొదట తలగుడ్డతో ఉన్న ఫొటోలను చూపించిన ఆమె చివరకు గుండుతో ఉన్న ఫొటోలను బయటపెట్టింది.
ఆ ఫోటోలలో అనారోగ్య చిహ్నాలేమీ లేకుండా ఆమె ముఖం కళకళలాడుతూ కనిపిస్తోంది. కేన్సర్ నుంచి బయటపడ్డాక ఆమె దృష్టి ఆధ్యాత్మికం వైపు మళ్లింది. నిత్యం పూజలతో గడుపుతోంది. వాటికి సంభందించిన ఫోటో లతో తన ట్విట్టర్ ఎక్కౌంట్ ని నింపేస్తోంది. తను ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్తోంది.
పోయినేడాది తనకు గర్భాశయ కేన్సర్ అని తేలడంతో చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లింది మనీషా. తర్వాత కేన్సర్ను జయించానంటూ ప్రపంచానికి వెల్లడించింది. ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు నిర్దారించారు. ఆమెలోని పాజిటివ్ వైబ్రేషన్సే త్వరగా కోలుకునేటట్లు చేసిందని చెప్తున్నారు. ఆమె అనారోగ్యం నుంచి విముక్తి అ్యయాక... షిరిడీ సాయిబాబా గుడికి వెళ్లింది. అలాగే ఓ చర్చిని కూడా సందర్శించింది.
మనీషా రీసెంట్ ఫోటోలు స్లైడ్ షో లో....
పూర్తి విముక్తి...హ్యాపీస్
కాన్సర్ నుంచి పూర్తిగా విముక్తి చెంది కోలుకున్న మాజీ హీరోయిన్ మనీషా కొయిరాలా మెల్లగా దైనందిన కార్యక్రమాల్లో పడుతోంది. తను కాన్సర్ ని జయించానని సంతోషంగా చెప్తోంది. అండాశయ క్యాన్సర్ చికిత్స నిమిత్తం న్యూయార్క్కు వెళ్లిన ఆమె అక్కడి తన అనుభవాలను ఎంతో భావోద్వేగంతో గుర్తు చేసుకుంటోంది.
ఆరోగ్యమే మహాభాగ్యం
అండాశయ క్యాన్సర్ చికిత్స నిమిత్తం న్యూయార్క్కు వెళ్లిన ఆమె అక్కడి తన అనుభవాలను ఎంతో భావోద్వేగంతో గుర్తు చేసుకుంటోంది. అక్కడి వీధుల్లో తెగతిరిగేసి షాపింగ్ చేశానంది. చల్లని నిమ్మరసం తాగుతూ...మొక్కజొన్నలు తింటూ...షాపుల వెంట తిరుగుతూ బేరాలు చేయడం ఓ ఆహ్లాదకరమైన అనుభవం అని చెప్పింది. రోడ్లపై నడుస్తుంటే ఎంతో హాయిగా అనిపించింది అంటూ ఆమె తన ట్విట్టర్లో రాసుకుంది.
మనీషా శకం..
నేపాల్కు చెందిన మనీషా కొయిరాలా 1991లో ‘సౌదాగర్' అనే చిత్రం ద్వారా భారతీయ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. తన అంద చందాలు, నటనా నైపుణ్యంతో అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ మనీషా కొయిరాలకు అవకాశాలు వెల్లువెత్తాయి. వయసు పైబడ్డాక సినిమా అవకాశాలు తగ్గడంతో నేపాల్ చెందిన వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని అతనితో పొసగక విడిపోయింది.
ఆధ్యాత్మిక బాటలో...
సర్వైకల్(అండాశయ) కేన్సర్ బారిన పడి అనారోగ్యానికి గురైన మాజీ స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలకు అమెరికా వైద్యులు నిర్వహించిన సర్జరీ సక్సెస్ అయింది. ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం మనీషా కొయిరాలా కోలుకుంటోందని ఆమె మేనేజర్ సుబ్రతో ఘోష్ తెలిపారు. ఆ ఉత్సాహంలో ఆమె గుళ్లూ ,గోపురాలూ సందర్శిస్తున్నారు.
మళ్లీ సినిమాల్లోకి?
వయసు పైబడ్డాక సినిమా అవకాశాలు తగ్గడంతో నేపాల్ చెందిన వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని అతనితో పొసగక విడిపోయింది. కెరీర్ సరిగా లేక పోవడం, పర్సనల్ లైఫ్ సమస్యలతో బాగా సఫర్ అయిన మనీషా.... ఆ మధ్య మద్యానికి బానిసైంది. ఆమె అనారోగ్యానికి ఈ అల వాటుకు కూడా కారణం అని అంటున్నారు. మనీషా చివరి సారిగా నటించిన సినిమా ఇటీవల రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘భూత్ రిటర్న్స్'. ఇప్పుడంతా సెట్ అయ్యాక ఆమె మళ్ళీ సినిమాల్లోకి వచ్చి చేస్తుందా లేదా అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న.
ప్రశంసలు..అభినందనలు
మనీషా తిరిగి కోలుకుని రావటంతో బాలీవుడ్ చాలా ఉత్సాహంగా ఆమెకు వెలకమ్ చెప్పింది. ఆమె తోటి హీరోయిన్స్ ఆమె పూర్తిగా కోలుకుని తిరిగి సినిమాల్లో నటించాలని అంటున్నారు. మనీషా ని ఫోన్ ల్లో పలకరిస్తూ ఆమెతో పనిచేసిన దర్శక,నిర్మాతలు ఆమెకు నైతిక ధైర్యానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు.