twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గురువును పిలిపించుకొని యోగా, ధ్యానం అభ్యాసం

    By Srikanya
    |

    ముంబై : క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన మనీషా కోయిరాలా రెండు మూడు నెలల్లో తిరిగి వెండితెరపై కనిపించవచ్చని ముంబై సిని వర్గాల సమాచారం. 'బాంబే', '1942 ఎ లవ్‌ స్టోరీ', 'దిల్‌ సే' తదితర సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అందాల తార ప్రస్తుతం యోగా, ధ్యానం మీద దృష్టిపెట్టింది. అండాశయ క్యాన్సర్‌కి న్యూయార్క్‌లో ఆరు నెలలపాటు చికిత్స తీసుకొని జూన్‌లో ముంబయికి తిరిగొచ్చిన ఆమె శారీరకంగా ఎంతో దృఢంగా ఉంది. మానసికంగా మరింత కుదుట పడడం కోసం నేపాల్‌ నుంచి ప్రత్యేకంగా గురువును పిలిపించుకొని యోగా, ధ్యానం అభ్యాసం చేస్తోంది.

    మనీషా తో సినిమాలు రూపొందించాలని చాలామంది దర్శకనిర్మాతలు సంప్రదిస్తున్నారని సమాచారం. అయితే నవంబరు వరకూ ఆమె సినిమాలకు దూరంగా ఉంటుందని సన్నిహితులు చెబుతున్నారు. కాన్సర్‌ నుంచి పూర్తిగా విముక్తి చెంది కోలుకున్న మాజీ హీరోయిన్ మనీషా కొయిరాలా మెల్లగా దైనందిన కార్యక్రమాల్లో పడుతోంది. తను కాన్సర్ ని జయించానని సంతోషంగా చెప్తోంది. అండాశయ క్యాన్సర్‌ చికిత్స నిమిత్తం న్యూయార్క్‌కు వెళ్లిన ఆమె అక్కడి తన అనుభవాలను ఎంతో భావోద్వేగంతో గుర్తు చేసుకుంటోంది.

    అండాశయ క్యాన్సర్‌ చికిత్స నిమిత్తం న్యూయార్క్‌కు వెళ్లిన ఆమె అక్కడి తన అనుభవాలను ఎంతో భావోద్వేగంతో గుర్తు చేసుకుంటోంది. అక్కడి వీధుల్లో తెగతిరిగేసి షాపింగ్‌ చేశానంది. చల్లని నిమ్మరసం తాగుతూ...మొక్కజొన్నలు తింటూ...షాపుల వెంట తిరుగుతూ బేరాలు చేయడం ఓ ఆహ్లాదకరమైన అనుభవం అని చెప్పింది. రోడ్లపై నడుస్తుంటే ఎంతో హాయిగా అనిపించింది అంటూ ఆమె తన ట్విట్టర్‌లో రాసుకుంది.

    నేపాల్‌కు చెందిన మనీషా కొయిరాలా 1991లో 'సౌదాగర్' అనే చిత్రం ద్వారా భారతీయ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. తన అంద చందాలు, నటనా నైపుణ్యంతో అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ మనీషా కొయిరాలకు అవకాశాలు వెల్లువెత్తాయి. వయసు పైబడ్డాక సినిమా అవకాశాలు తగ్గడంతో నేపాల్ చెందిన వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని అతనితో పొసగక విడిపోయింది. సర్వైకల్(అండాశయ) కేన్సర్ బారిన పడి అనారోగ్యానికి గురైన మనీషా కొయిరాలకు అమెరికా వైద్యులు నిర్వహించిన సర్జరీ సక్సెస్ అయింది. ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం మనీషా కొయిరాలా కోలుకుంటోందని ఆమె మేనేజర్ సుబ్రతో ఘోష్ తెలిపారు. ఆ ఉత్సాహంలో ఆమె గుళ్లూ ,గోపురాలూ సందర్శిస్తున్నారు.

    English summary
    
 Actress Manisha Koirala, who is finding solace in yoga following her successful battle against cancer, will most likely start working on her next project in November, her manager said. “She is busy with her yoga and meditation for wellness. A special guru from Nepal has come down for her. She is physically fit and now she wants to be mentally fit before starting any project. She will start working from November and not before that,” Manisha’s manager Subroto Ghosh said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X