Don't Miss!
- News పవన్ ను ఆడిస్తున్న చంద్రబాబు-పెళ్ళిళ్లే కాదు సీట్లూ నాలుగే- కాకినాడలో జగన్ కామెంట్స్..!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
గురువును పిలిపించుకొని యోగా, ధ్యానం అభ్యాసం
మనీషా తో సినిమాలు రూపొందించాలని చాలామంది దర్శకనిర్మాతలు సంప్రదిస్తున్నారని సమాచారం. అయితే నవంబరు వరకూ ఆమె సినిమాలకు దూరంగా ఉంటుందని సన్నిహితులు చెబుతున్నారు. కాన్సర్ నుంచి పూర్తిగా విముక్తి చెంది కోలుకున్న మాజీ హీరోయిన్ మనీషా కొయిరాలా మెల్లగా దైనందిన కార్యక్రమాల్లో పడుతోంది. తను కాన్సర్ ని జయించానని సంతోషంగా చెప్తోంది. అండాశయ క్యాన్సర్ చికిత్స నిమిత్తం న్యూయార్క్కు వెళ్లిన ఆమె అక్కడి తన అనుభవాలను ఎంతో భావోద్వేగంతో గుర్తు చేసుకుంటోంది.
అండాశయ క్యాన్సర్ చికిత్స నిమిత్తం న్యూయార్క్కు వెళ్లిన ఆమె అక్కడి తన అనుభవాలను ఎంతో భావోద్వేగంతో గుర్తు చేసుకుంటోంది. అక్కడి వీధుల్లో తెగతిరిగేసి షాపింగ్ చేశానంది. చల్లని నిమ్మరసం తాగుతూ...మొక్కజొన్నలు తింటూ...షాపుల వెంట తిరుగుతూ బేరాలు చేయడం ఓ ఆహ్లాదకరమైన అనుభవం అని చెప్పింది. రోడ్లపై నడుస్తుంటే ఎంతో హాయిగా అనిపించింది అంటూ ఆమె తన ట్విట్టర్లో రాసుకుంది.
నేపాల్కు చెందిన మనీషా కొయిరాలా 1991లో 'సౌదాగర్' అనే చిత్రం ద్వారా భారతీయ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. తన అంద చందాలు, నటనా నైపుణ్యంతో అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ మనీషా కొయిరాలకు అవకాశాలు వెల్లువెత్తాయి. వయసు పైబడ్డాక సినిమా అవకాశాలు తగ్గడంతో నేపాల్ చెందిన వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని అతనితో పొసగక విడిపోయింది. సర్వైకల్(అండాశయ) కేన్సర్ బారిన పడి అనారోగ్యానికి గురైన మనీషా కొయిరాలకు అమెరికా వైద్యులు నిర్వహించిన సర్జరీ సక్సెస్ అయింది. ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం మనీషా కొయిరాలా కోలుకుంటోందని ఆమె మేనేజర్ సుబ్రతో ఘోష్ తెలిపారు. ఆ ఉత్సాహంలో ఆమె గుళ్లూ ,గోపురాలూ సందర్శిస్తున్నారు.