Don't Miss!
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అండాశయ కేన్సర్ అంటూ మనీషా కొయిరాలా ప్రకటన
సుబ్రతో ఘోష్ మాట్లాడుతూ... ''అండాశయ కేన్సర్ సోకిన మనీషాకు గురువారం న్యూయార్క్లో శస్త్రచికిత్స జరిగింది'' అని వివరించారు. గతనెల 28న ఆమె అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మనీషాకు కేన్సర్ సోకిందంటూ అప్పడు వదంతులు వచ్చాయి. తాజాగా అవి నిజమేనని తేలింది. తనకు కేన్సర్ రావడంపై దిగ్భ్రాంతికి గురయ్యానని, అయితే త్వరలోనే కోలుకుంటానని మనీషా విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఫేస్బుక్లోని తన పేజీలో ఓ సందేశం పోస్ట్ చేశారు.
తన కుటుంబం, స్నేహితులు, అభిమానులు అందరూ సంతోషంగా ఉండాలనే తాను కోరుకుంటున్నానని వెల్లడించారు. ఇదంతా జీవితంలో ఓ భాగమని, ఎవరూ బాధపడొద్దని తాను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నానని, క్షేమంగానే ఉంటానని చెప్పారు. 1991లో సౌదాగర్ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన మనీషా.. దిల్సే, 1942: ఎ లవ్ స్టోరీ వంటి సినిమాలతో బాగా పేరు సంపాదించారు. ఇటీవల విడుదలైన రాంగోపాల్వర్మ 'భూత్ రిటర్న్స్' సినిమాలో నటించడం ద్వారా మనీషా నటనలో తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు.