twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిత్తూరు ఆశ్రమంలో సేదతీరుతున్న మనీషా కొయిరాల

    By Bojja Kumar
    |

     Manisha Koirala visits Oneness University
    హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాలా గత కొన్ని సంవత్సరాలుగా రెగ్యులర్‌గా చిత్తూరు జిల్లాలోని 'వన్‌నెస్ యూనివర్శిటీ'ని సందర్శిస్తున్నారు. ఇదొక ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం. చిత్రూరు జిల్లా వరదయ్య పాలెం సమీపంలోని బట్టవల్లం వద్ద ఈ వన్ నెస్ యూనివర్శిటీ ఉంది.

    ఈ సంవత్సరం కూడా మనీషా కొయిరాలా ఈ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ....ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంటుందని, వన్ నెస్ యూనివర్శిటీ ఆధ్యాత్మిక వాతావరణం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుందని తెలిపారు. క్యాన్సర్, ఇతర సమస్యలతో సతమతం అయిన తనకు బ్యాలెన్స్డ్ హ్యాపీ లైఫ్ ఎలా సాగించాలో ఇక్కడి టీచింగ్ ద్వారానే అర్థమయిందని తెలిపారు.

    క్యాన్సర్ వ్యాధితో పోరాడే వారు డాక్టర్ల సలహాలు తప్పకుండా పాటించాలని, వ్యాయామం కూడా ఎంతో అవసరమని మనీషా కొయిరాలా సూచించారు. త్వరలో ఒక గర్ల్ చైల్డ్‌ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.

    English summary
    
 Manisha Koirala, who regularly visits the Oneness University in Chittoor for meditation, says that one of the main reasons that she and her family managed to deal with her cancer was the university and its teaching.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X