Just In
- 6 min ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
Don't Miss!
- News
ఇంగితజ్ఞానం ఉన్నవాళ్లు ఆ పనిచేయరు... దమ్ముంటే కేసీఆర్ దానిపై ప్రకటన చేయాలి : సంజయ్ సవాల్
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్ఫండ్?'
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వరదల్లో చిక్కుకున్న హీరోయిన్.. ఆందోళనలో చిత్రయూనిట్.. చివరకు ఇదీ జరిగింది!
సినిమా షూటింగ్ నిమిత్తం ఉత్తర భారత దేశంలోని అందమైన ప్రదేశానికి వెళ్లిన ఓ సినిమా యూనిట్ ఊహించని విధంగా ప్రమాదంలో చిక్కుకున్నారు. అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో వారున్న ప్రదేశం నుంచి బయటపడలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి వెంటనే సహాయం చేయాల్సిందిగా ఆదేశించారు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగింది? పూర్తి వివరాలు చూస్తే..

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వరద బీభత్సం
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. జనజీవనం స్తంభించిపోయి అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సరిగ్గా ఈ సమయంలో షూటింగ్ నిమిత్తం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిన మళయాళ సినిమా యూనిట్ అనుకోని ఇబ్బందుల్లో పడింది.

వరదల్లో చిక్కుకున్న హీరోయిన్
షూటింగ్ నిమిత్తం రెండు వారాల క్రితం హిమాచల్ ప్రదేశ్ మనాలీకి వంద కిలోమీటర్ల దూరంలో ఉండే చత్ర అనే ప్రదేశానికి మలయాళ హీరోయిన్ మంజు వారియర్ తో పాటు మరో 30 మందితో కూడిన చిత్ర యూనిట్ వెళ్లారు. అయితే ఉన్నట్టుండి భారీ వర్షాలు రావడం, వరదలు ముంచెత్తడంతో రోడ్లు కొట్టుకుపోయి వారంతా అక్కడి నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది.

ఆందోళన చెందిన చిత్రయూనిట్.. సాయం కోసం
వరద ఉదృతి మరింత పెరుగుతండటంతో యూనిట్ సభ్యులు ఆందోళన చెందారు. ఈ మేరకు హీరోయిన్ మంజు వారియర్ తన సోదరుడికి ఫోన్ చేసి కన్నీరు పెట్టుకుందట. అతడి సలహా మేరకు సోషల్ మీడియా ద్వారా కేంద్రమంత్రి వి.మురళీధరన్ను సాయం కోరడంతో సహాయక చర్యలు చేపట్టారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కలుగజేసుకొని
విషయం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ వరకు వెళ్లడంతో ఆయన వెంటనే రెస్క్యూ టీంని బరిలోకి దించి మంజు వారియర్ తో పాటు ఆమె తోటి చిత్ర యూనిట్ సభ్యులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ప్రస్తుతం అందరూ సేఫ్ గా ఉన్నారని తెలిసింది.