Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
వరదల్లో చిక్కుకున్న హీరోయిన్.. ఆందోళనలో చిత్రయూనిట్.. చివరకు ఇదీ జరిగింది!
సినిమా షూటింగ్ నిమిత్తం ఉత్తర భారత దేశంలోని అందమైన ప్రదేశానికి వెళ్లిన ఓ సినిమా యూనిట్ ఊహించని విధంగా ప్రమాదంలో చిక్కుకున్నారు. అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో వారున్న ప్రదేశం నుంచి బయటపడలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి వెంటనే సహాయం చేయాల్సిందిగా ఆదేశించారు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగింది? పూర్తి వివరాలు చూస్తే..
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వరద బీభత్సం
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. జనజీవనం స్తంభించిపోయి అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సరిగ్గా ఈ సమయంలో షూటింగ్ నిమిత్తం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిన మళయాళ సినిమా యూనిట్ అనుకోని ఇబ్బందుల్లో పడింది.
వరదల్లో చిక్కుకున్న హీరోయిన్
షూటింగ్ నిమిత్తం రెండు వారాల క్రితం హిమాచల్ ప్రదేశ్ మనాలీకి వంద కిలోమీటర్ల దూరంలో ఉండే చత్ర అనే ప్రదేశానికి మలయాళ హీరోయిన్ మంజు వారియర్ తో పాటు మరో 30 మందితో కూడిన చిత్ర యూనిట్ వెళ్లారు. అయితే ఉన్నట్టుండి భారీ వర్షాలు రావడం, వరదలు ముంచెత్తడంతో రోడ్లు కొట్టుకుపోయి వారంతా అక్కడి నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది.
ఆందోళన చెందిన చిత్రయూనిట్.. సాయం కోసం
వరద ఉదృతి మరింత పెరుగుతండటంతో యూనిట్ సభ్యులు ఆందోళన చెందారు. ఈ మేరకు హీరోయిన్ మంజు వారియర్ తన సోదరుడికి ఫోన్ చేసి కన్నీరు పెట్టుకుందట. అతడి సలహా మేరకు సోషల్ మీడియా ద్వారా కేంద్రమంత్రి వి.మురళీధరన్ను సాయం కోరడంతో సహాయక చర్యలు చేపట్టారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కలుగజేసుకొని
విషయం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ వరకు వెళ్లడంతో ఆయన వెంటనే రెస్క్యూ టీంని బరిలోకి దించి మంజు వారియర్ తో పాటు ఆమె తోటి చిత్ర యూనిట్ సభ్యులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ప్రస్తుతం అందరూ సేఫ్ గా ఉన్నారని తెలిసింది.