Don't Miss!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ సమయంలో డిప్రెషన్లోకి.. ఎలా బయట పడాలో తెలియలేదు.. తన కథ చెప్పిన మంజుల ఘట్టమనేని
స్టార్ హీరోల వారసత్వంగా వారి వారి కుమారులు వెండితెరపై ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణం. వారి అభిమానులు కూడా అదే కోరుకుంటారు. తమ హీరోల వారసత్వంగా వారి కొడుకులు రాజ్యమేలాలని ఆశిస్తుంటారు. అయితే అదే సమయంలో స్టార్ హీరోల కుమార్తెలను మాత్రం వారసురాలిగా ఒప్పుకోరు. అందుకే మన హీరోలు సైతం కుమార్తెలను హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయం చేయరు. ఆ క్రమంలోనే గొప్ప నటి కావాలని అనుకున్న మంజుల ఘట్టమనేని కూడా వెండితెరకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
ఫ్యాన్స్ వ్యతిరేకత..
అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ప్రభంజనం ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సూపర్ స్టార కృష్ణ కూతురుగా మంజుల వెండితెరపై ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నించింది. అయితే ఘట్టమనేని అభిమానులు, కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించలేదు. అందుకే ఆ ఆలోచనే మార్చుకుంది.
జాతీయ అవార్డు గ్రహీత..
హీరోయిన్గా కాకపోయినా సినీ రంగానికి మాత్రం దగ్గరగానే ఉంది. పోకిరి చిత్ర నిర్మాతగా, షో వంటి విభిన్న చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. జాతీయ అవార్డును సాధించి తన సత్తాను చాటిచెప్పింది. అయితే తాజాగా ఆమె కొత్త బిజినెస్లోకి దిగింది.
వెబ్సైట్, యూట్యూబ్..
మంజుల ఘట్టమనేని వెబ్సైట్, యూట్యూబ్ ఛానెల్ను ప్రారంభించింది. ఈ మేరకు ఆ యూట్యూబ్ చానెల్తో తన జీవిత కథను చెబుతూ మొదటి వీడియోను పోస్ట్ చేసింది. జీవన శైలి, సమయపాలన, ఆరోగ్యం, దైవం, స్ఫూర్తి కలిగించే అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తానని తెలిపింది.
Recommended Video
డిప్రెషన్లోకి వెళ్లిపోయా...
హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న తన నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించిన సమయంలో డిప్రెషన్లోకి వెళ్లానని తెలిపింది. దాని నుంచి బయటకు రావడానికి ధ్యానం చేశానని, దాదాపు 30 యేళ్లు చేస్తూనే ఉన్నానని పేర్కొంది. పది వేల గంటలకు పైగా ధ్యానంలోనే గడిపానని చెప్పుకొచ్చింది.