Don't Miss!
- News హైదరాబాదు వాసులకు కూల్ న్యూస్.. పలు జిల్లాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు..!
- Sports ఛాంపియన్లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
పుష్ప 2లో ఫ్యామిలీ మ్యాన్ అంటూ రూమర్స్ .. మొత్తానికి క్లారిటీ ఇచ్చేశాడుగా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభించిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అంచనాలకు మించి అన్నట్టుగా ఉండడంతో కొన్ని నెలలపాటు ముఖ్యంగా బాలీవుడ్ లో పుష్ప ఫీవర్ కొనసాగింది. ఇక మొదటి పార్ట్ అద్భుతమైన విజయం సాధించడంతో పుష్ప-2పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా సుకుమార్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తుండడంతో ఆలస్యం జరిగింది. ఇక ఇప్పుడు ఆగస్టులో సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నారు.
ఈ నేపథ్యంలో పుష్ప -2 లో మరి కొంతమంది స్టార్ నటీనటులు యాడ్ అవ్వబోతున్నారంటూ కొంతమంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. సినిమాను అంచనాలకు తగ్గట్టుగా తెరకెక్కించడానికి సుకుమార్ టీం సిద్ధమవుతుండగా మరోవైపు క్రేజీ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్ పాయ్ భాగం కాబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ మెన్ సిరీస్ తో మనోజ్ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా వార్తలపై స్పందించిన ఆయన ఇలాంటి అప్డేట్స్ ఎవరిస్తారు మీకు ? అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ సినిమాలో తను భాగం కావట్లేదు అనే విషయాన్ని స్పష్టం చేశారు.
దీంతో ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్లకు చెక్ పడింది. ఇక ఈ పుష్ప -2 లో మొదటి పార్ట్ లో భాగమైన స్టార్ నటీనటులు కంటిన్యూ కానున్నారు. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ కొనసాగనుండగా, ఫహద్ ఫాసిల్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇక ఈ పార్ట్ లో నటించనున్న మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై యలమంచిలి రవిశంకర్, నవీన్ యెర్నేని సంయుక్తంగా నిర్మించనున్నారు. అలాగే సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ పుష్ప -2 కి కూడా కొనసాగున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని అల్లు అర్జున్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.