Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాలీవుడ్ నటుడు మనోజ్కుమార్కు ఆపరేషన్
ఇక ఆ మధ్య షారుఖ్ఖాన్పై ఆనాటి స్టార్ హీరో మనోజ్కుమార్ మరోసారి మండిపడ్డారు. రూ. 100 కోట్ల మేర పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. షారుఖ్, ఈరోస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మించిన 2007 నాటి సూపర్ హిట్ ఫిల్మ్ 'ఓం శాంతి ఓం'లో తనని అనుకరిస్తూ షారుఖ్ చేసిన పేరడీ సన్నివేశాల్ని తొలగించకుండా జపాన్లో ఆ సినిమాని విడుదల చేసారని ఆయన సీరియస్ అయ్యారు.
ఆ సినిమాని అప్పట్లో శాటిలైట్ చానల్స్లో ప్రసారం చేయడానికి ముందుగానే తనకి సంబంధించి పేరడీ సన్నివేశాల్ని తొలగించాలంటూ ఆయన కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అవి పట్టించుకోకుండా ప్రసారం చేస్తున్నారు. జపాన్ లోనూ విడుదల చేసారు. ఇవన్నీ ఈ సీనియర్ హీరోని సీరియస్ అయ్యేలా చేసాయి.
మనోజ్ కుమార్ మాట్లాడుతూ... "ఆ సన్నివేశాల్ని తొలగించకుండా జపాన్లో 'ఓం శాంతి ఓం'ను రిలీజ్ చేశారు. ఇప్పటికే వాళ్లను రెండుసార్లు క్షమించాను. ఈసారి అలా చేయలేను. వాళ్లు నన్ను అగౌరవ పరిచారు. అన్ని ప్రింట్లు, ప్రసార కాపీల నుంచి ఆ సన్నివేశాల్ని తొలగించమని 2008లోనే కోర్టు తీర్పునిచ్చింది. అందువల్ల వారు కోర్టు ధిక్కార నేరాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. రూ. 100 కోట్ల పరువు నష్టం కోరుతూ షారుఖ్, ఈరోస్ ఇంటర్నేషనల్పై రేపు సివిల్, క్రిమినల్ కేసుల్ని వేయబోతున్నాను'' అని చెప్పారు .