Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మంచు మనోజ్ టీజర్ ఎందుకు రిలీజ్ చేయలేదు..? అమ్మ మరణం వల్లనే అని....
జయలలిత వంటి గొప్ప నాయకురాలిని కోల్పోవడం వలన గుంటూరోడు టీజర్ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు మనోజ్ చెప్పాడు.
డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్, కొద్దికాలంగా హిట్ కోసం ఎంతగానో తపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తనకు మంచి గుర్తింపు తెచ్చిన డిఫరెంట్ కమర్షియల్ సినిమానే నమ్ముకొని 'ఒక్కడు మిగిలాడు', 'గుంటూరోడు' అన్న రెండు సినిమాలను సిద్ధం చేస్తున్నారు. మంచు మనోజ్ కథానాయకుడిగా 'గుంటూరోడు' సినిమా రూపొందింది. సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ నటించింది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, ఆ తరువాత పనులను వేగంగా జరుపుకుంటోంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మనోజ్ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా.. సంపత్, కోట శ్రీనివాస రావు, రావు రమేష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి మోషన్ పోస్టర్ విడుదల చేయగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా నుంచి ఈ నెల 7వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయాలనుకున్నారు. గుంటూరులో ఒక వేడుక ద్వారా ఈ టీజర్ ను వదలాలని నిర్ణయించుకున్నారు. అయితే దేశం జయలలిత వంటి గొప్ప నాయకురాలిని కోల్పోవడం వలన, టీజర్ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు మనోజ్ చెప్పాడు. టీజర్ రిలీజ్ కి కొత్త డేట్ ఎప్పుడనేది త్వరలో చెబుతామని అన్నాడు.