మంత్ర దర్శకుడితో పూరీకేం పని?

ఇక ఇంతకుముందు మెగా ప్రొడ్యూసర్ ఎమ్.ఎస్.రాజు నిర్మాతగా తులసీరామ్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే మస్కా ఫలితం అనుకూలంగా లేకపోవటం, తులసి చెప్పిన స్క్రిప్టు ఎమ్.ఎస్.రాజుకి నచ్చకపోవటంతో అది విరమించుకున్నాడని అంటున్నారు. ఇక ఏడాది పాటు వండిన స్క్రిప్టుని ఇప్పుడు సాయిరామ్ కి కట్టబెడుతున్నాడన్నమాట. ఇంతకు ముందు తులసి వరుణ్ సందేశ్ ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టు చేసాడు. ఒక విచిత్రమైన ప్రేమకథగా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. ఇక కథనంలో పూరీ హస్తం కూడా ఉండవచ్చునని అంటున్నారు. ఏదైమైనా పూరీకీ, తులసీరామ్ కీ ఎలా ఉన్నా సాయిరామ్ శంకర్ కి మాత్రం ఈ ప్రాజెక్టు పెద్ద ఊరటే.


Click it and Unblock the Notifications











