Don't Miss!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
‘ప్రాణం’ పోయింది.. ఇదేం సినిమారా బాబూ అని అన్నారు.. మారుతి కామెంట్స్
ఈరోజుల్లో, బస్టాప్ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలను తీసి బూతు సినిమాల డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు మారుతి. ప్రేమకథా చిత్రమ్ లాంటి హారర్ సినిమాను తీసి మంచి దర్శకుడిగా క్రేజ్ సంపాదించుకుంటే.. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు లాంటి చిత్రాలతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా ఓ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తెరకెక్కించాడు. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించాడు.
ఆర్య నిలబెట్టింది..
తనకు ‘ఆర్య' సినిమా బలాన్ని ఇచ్చిందని అన్నాడు. అంతకుముందు తన దగ్గర ఓ రెండు లక్షలు ఉంటే ‘ప్రాణం' అనే సినిమాకు డబ్బులు ఇచ్చానని.. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో మా ప్రాణం పోయిందని చమత్కారంగా మాట్లాడాడు. ఈ విషయాన్ని అల్లు అరవింద్కు చెబితే ‘మీకెందుకు డిస్ట్రిబ్యూషన్' అని తిట్టినట్లు తెలిపాడు. దాని తర్వాత ‘ఆర్య' సినిమా కోసం బన్ని వాసుతో కలిసి భాగస్వామిని అయ్యానని అన్నాడు. దీంతో కాస్త ఆర్థికంగా నిలదొక్కుకున్నామని, అలా అప్పటి నుంచి ప్రతి సినిమాలో కొంత పార్టనర్షిప్ ఉండేదని పేర్కొన్నాడు.
చిరు ప్రోత్సాహంతో..
కొన్నాళ్లు యానిమేషన్ రంగంలో పనిచేశానని తెలిపాడు. తర్వాత చిరంజీవి దగ్గర ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. ఆయన యాడ్ ఫిల్మ్స్ పనులు చూస్తుండేవాడినని పేర్కొన్నాడు. తన వర్క్ నచ్చడంతో ఆయన తనను ప్రోత్సహించేవారని అన్నాడు. అప్పట్లో 5డీ కెమెరా వచ్చిందని వర్మ షో వేసి చూపించారనీ, దీంతో కెమెరా ఉంటే చాలు సినిమా తీయొచ్చని ఆ సెటప్ మొత్తం కొనుక్కొని తక్కువ బడ్జెట్లో ‘ఈ రోజుల్లో' అనే సినిమా తీశానని నాటి సంగతులను గుర్తుచేసుకున్నాడు. అది విజయం సాధించడం తమకు కలిసొచ్చిందని తెలిపాడు.
ఇదేం సినిమారా బాబూ..
ప్రేమకథా చిత్రమ్.. సినిమా పూర్తయిన తర్వాత చూసిన వాళ్లందరూ ‘ఇదేం సినిమారా బాబూ.. నీకెందుకురా ఈ సినిమా. ఆ సప్తగిరిగాడు ఇరిటేట్ చేసేస్తున్నాడు. దర్శకుడిగా నీపేరు వేసుకోవద్దు. మీ కెమెరామెన్ పేరు వేయ్' అని అన్నారని చెప్పుకొచ్చాడు. అయితే తనకు మాత్రం నమ్మకం ఉండేదన్నాడు. అందుకే ‘మారుతి పర్యవేక్షణ' అని వేసేవాడినని తెలిపాడు ఆ సినిమా హిట్ కావడంతో తనకు నమ్మకం కలిగిందన్నాడు. సినిమా బాగుంటే ప్రేక్షకులు చూస్తారని అర్థమైందని తెలిపాడు.
అదో సెంటిమెంట్..
ప్రతీ రోజూ పండగేనా మనసుకు కూడా దగ్గరైన కథ . ‘అరె ఈ పాయింట్ మిస్సవుతున్నాం కదా' అని థియేటర్కు వచ్చి చాలా మంది ఫీలవుతారని అన్నాడు. ‘భలే భలే మగాడివోయ్' కథ మొదట చిరంజీవిగారికి చెప్పానన్నాడు. ఆయనకు బాగా నచ్చిందని నాటి విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. ‘హీరోకు ఒక లోపం పెట్టి బాగాచేశావ్' అని మెచ్చుకున్నట్లు తెలిపాడు. దాని తర్వాత ప్రతీరోజూ పండగే కథ చెప్పానని.. ఇది కూడా బాగుందని చెప్పారు. అలా ఆయన చెప్పడం తనకు సెంటిమెంట్గా మారిందన్నాడు.