Don't Miss!
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వేలంలో 'మర్యాదరామన్న' సైకిల్ కి పలికిన రేటెంతంటే...
సునీల్ మర్యాదరామన్న చిత్రంలో నటించిన సైకిల్ ని వేలానికి పెట్టిన సంగతి తెలిసిందే. మా టీవి టై అప్ తో అన్నపూర్ణా స్టూడియోస్ లో శనివారం జరిగిన ఈ వేలంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్..నిర్మాత ఆచంట గోపీచంద్ పాల్గొని 1,51,001 కి సైకిల్ ని సొంతం చేసుకున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు..మర్యాదరామన్న చిత్రాన్ని కృష్ణ జిల్లాలో పంపిణీ చేసారు. ఇక 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నమో వెంకటేశ చిత్రం సంక్రాంతికి రిలీజైంది. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ మొత్తానికి ఆర్కా మీడియావారు, దర్శకుడు రాజమౌళి కలిసి మూడు రెట్లు వేసారు. అలాగే ..సునీల్.. 51000 డొనేట్ చేసాడు. అలాగే శ్రీనాధ్ అనే బిల్డర్.. 25,000, విలన్ నాగినీడు,బ్రహ్మాజి కలిసి 10000, ప్రముఖ పి.ఆర్.వో.. బి.ఎ.రాజు ..10000 విరాళాలు ప్రకటించారు. వీటినన్నటినీ కలిపితే వచ్చిన 5,49,000 రూపాయల్ని.. హైదరాబాద్..బేగంపేటలోని దేవనర్ బ్లైండ్ స్కూల్ కి అందచేసారు.