Don't Miss!
- Sports రోహిత్ శర్మ ప్లేస్లో..!!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాగుంది: 'మర్యాద రామన్న' మళయాళ రీమేక్ ట్రైలర్ (వీడియో)
హైదరాబాద్ : రాజమౌళి, సునీల్ కాంబినేషన్ లో వచ్చి హిట్టైన చిత్రం మర్యాద రామన్న. ఈ చిత్రం ఇప్పటికే కన్నడ, హిందీ, తమిళ భాషల్లో రీమేక్ అయ్యింది. ఇప్పుడు మళయాళిలను సైతం పలకరించటానికి సిద్దపడుతోంది. దిలీప్ హీరోగా రూపొందిన ఈ చిత్రం ఇవాన్ మర్యాద రామన్ టైటిల్ తో రూపొందుతోంది. నిక్కి గాలరాని ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఆ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. మీరు చూడండి ఆ ట్రైలర్ ఎలా ఉందో.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ చిత్రాన్ని మళయాళంలో సురేష్ దివాకర్ డైరక్ట్ చేస్తున్నారు. సంగీత దర్శకుడు గోపీ సుందర్, కెమెరా వర్క్ విజయ్ ఉలగనాథ్ అందిస్తున్నారు. ఒరిజినల్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ రీమేక్ తెరకెక్కిందని చెప్తున్నారు. దిలీప్ ఆల్రెడీ అక్కడ పేరున్న కామెడీ హీరో కాబట్టి ఖచ్చితంగా మంచి విజయం సాధించే అవకాసం ఉంది. ఈ వేసవిలో ఈ చిత్రం విడుదల అవుతుంది.
మర్యాద రామన్న చిత్రం కథ ఒక్కసారి గుర్తు చేసుకుంటే..
హైదరాబాద్ లో నానా కష్టాలుపడుతూ జీవితాన్ని లాక్కొస్తున్న అనాధ రాము(సునీల్). అతనికి ఆశాకిరణంలా ఓ రోజు చిన్నప్పుడే వదిలేసిన తన సొంత ప్రాతం రాయలసీమ నుంచి ఓ ఉత్తరం వస్తుంది. ఆ గ్రామంలో ఉన్న వారసత్వపు పొలాన్ని స్వాధీనం చేసుకోమని ఆ లెటర్ లో ఉంటుంది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన రాము ఆ ఊరుకి గాల్లో తేలుకుంటూ బయిలుదేరతాడు. రాముకి ప్రయాణంలో అపర్ణ(సలోని)అనే అందాల అమ్మాయి పరిచయమవుతుంది. ఆమెతో ఓ పాట పాడుకుని తన ఊరు వెళ్ళిన రాముకి ఆ ఊరి పెద్ద రామనీడు(నాగినీడు)ఆతిధ్యమిస్తాడు.
ఆ క్రమంలో వాళ్ళతో వారి ఇంటకి వెల్ళిన రాముకి రామనీడు తను ఇష్టపడ్డ అమ్మాయి అపర్ణ తండ్రి అని తెలిస్తుంది. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవకుండా వెంటనే మరో విషయం బయిటపడుతుంది. అది వేరేదో కాదు..రామనీడు చిరకాల ప్రత్యర్ధి కొడుకే రాము. ఇది తెలిసిన వెంటనే రామనీడు, అతని కొడుకులు వెంటనే రాముని చంపేయాలనుకుంటారు. అయితే తమ ఆచారం ప్రకారం ఇంటిలో చంపకూడదని,గుమ్మం దాటి బయిటకు అడుగుపెట్టిన వెంటనే చంపేయాలని రెడీ అవుతారు. విషయం తెలుసుకున్న రాము ఇల్లు గుమ్మం దాటి బయిటకు వెళ్ల కూడదనుకుని నిర్ణయించుకుంటాడు. ఈ విపత్కర పరిస్ధితుల్లో ఇరుకున్న రాము అక్కడనుంచి ఎలా బయిటపడి తన ప్రాణాలు కాపాడుకుని,తను ఇష్టపడ్డ అమ్మాయిని ఎలా పెళ్ళి చేసుకున్నాడు అనేది మిగతా కథ.