Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మాస్ రాజా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.. మొదలయ్యేది ఎప్పుడంటే?
క్రాక్ సినిమాతో వరుస ఫెయిల్యూర్స్ కు బ్రేక్ వేసిన మాస్ మహారాజా రవితేజ మొత్తానికి ఫామ్ లోకి వచ్చేశాడు. రాజా ది గ్రేట్ అనంతరం సెకండ్ స్టేజ్ లాంటి డిజాస్టర్స్ అందుకున్న రవితేజ ఒక్క హిట్టుతో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు. క్రాక్ బాక్సాఫీస్ వద్ద డబుల్ ప్రాఫిట్స్ అందించడంతో ఆఫర్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి.
ఇక నెక్స్ట్ రవితేజ ఖిలాడి సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమాపై కూడా అభిమానుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఆ సినిమాకి రాక్షసుడు దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఆ సినిమా అనంతరం మాస్ రాజా మరో కమర్షియల్ దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు ఇటీవల అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అతను మరెవరో కాదు. సినిమా చూపిస్త మావ, నేను లోకల్ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు త్రినాథరావు నక్కిన. ఈ టాలెంటెడ్ దర్శకుడితో కామెడీ ఎంటర్టైనర్ లో సినిమా చేయడానికి ఒప్పుకున్న మాస్ రాజా రెగ్యులర్ షూటింగ్ ను ఏప్రిల్ లో స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కుదిరితే ఈ ఎడాది చివరలోనే ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావచ్చని టాక్ కూడా వస్తోంది. అలాగే మాస్ రాజా మరో కొత్త దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.