Don't Miss!
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Lifestyle రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఖరారు: అల్లు అర్జు్న్,బోయపాటి చిత్రం కి మాస్ టైటిల్
హైదరాబాద్: అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ చిత్రం మొదలయ్యి రెగ్యులర్ షూటింగ్ జూలై 29 నుంచీ జరుగుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘సరైనోడు' అనే టైటిల్ పెట్టే అవకాసం ఉందని సమాచారం. ఈ మేరకు రిజిస్టర్ చేస్తున్నట్లు, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ లు హీరోయిన్స్ గా చేస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ చిత్రానికి సంభందించిన మరిన్ని విశేషాలు..
యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో విలన్ ఎంపిక పూర్తైందని తెలుస్తోంది. ఆ పాత్రలో కనిపించేది మరెవరో కాదు...గతంలో ఒక విచిత్రం, గుండెల్లో గోదారి చిత్రాల్లో హీరోగా కనిపించిన ఆది పినిశెట్టి అని సమాచారం. అయితే ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి తెలుగులో బిజీ అవుతానని భావిస్తున్నట్లు సమాచారం.
అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరమ్మాయిలతొ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్ ని కంపోజ్ చేసిన కెచ్చా ని ఈ సినిమాకోసం తీసుకున్నట్టు సమాచారం. కెచ్చా..ధాయిలాండ్ కు చెందిన ఫైట్ మాస్టర్.
తొలి నుంచి తనదైన శైలిలో మాస్ కథల్ని తెరకెక్కించడంలో ప్రత్యేకత చూపుతూ హిట్స్ కొట్టడం బోయపాటి శ్రీను శైలి ప్రత్యేకం. 'భద్ర', 'తులసి', 'సింహా' చిత్రాలతో హిట్ చిత్రాల దర్శకుడయ్యారు. గతేడాది 'లెజెండ్'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకొన్నారాయన. దాంతో అల్లు అర్జున్తో సినిమా చేసేందుకు కథను సిద్ధం చేసుకొన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘అల్లు అర్జున్, బోయపాటి శీను కాంబినేషన్లో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. బోయపాటి శ్రీను చెప్పిన కథ నాకు, బన్నికి బాగా నచ్చి మా గీతా ఆర్ట్స్లోనే చేస్తున్నాం. పూర్తిస్థాయి హీరోయిజం ఉంటూ ప్యూర్ లవ్ స్టోరీ మిక్స్ అయిన కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తాం.
బన్నిని అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో పక్కాగా అలాంటి పాత్రతో బోయపాటి శీను కథ చెప్పారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. ఆ వివరాలను త్వరలో చెప్తాం. బన్ని కాంబినేషన్లో థమన్ చేస్తున్న రెండో సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా అవుతుంది'' అని తెలిపారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘బన్ని బాడీ లాంగ్వేజ్కి సరిపోయే కథను సిద్ధం చేశాను. అరవింద్గారు, బన్ని ఈ కథ విని వెంటనే ఓకే చేశారు. పక్కా అవుట్ అండ్ అవుట్ హీరోయిజం ఉన్న స్టోరీ ఇది. లవ్ స్టోరీ కూడా మిళితమై ఉంటుంది. కొత్త బన్ని కనిపిస్తారు. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో ఓ సినిమా చేస్తాను'' అని తెలిపారు.
అల్లు
అర్జున్
హీరోగా
బోయపాటి
శ్రీను
దర్శకత్వంలో
గీతా
ఆర్ట్స్
సంస్థలో
ఓ
సినిమా
రూపొందనుంది.థమన్.ఎస్.ఎస్.
ఈ
చిత్రానికి
సంగీతాన్ని
అందిస్తున్నారు.
ఈ
సినిమాకి
సంగీతం:
థమన్.ఎస్.ఎస్.,
మాటలు:
ఎం.రత్నం,
కథ,
స్క్రీన్
ప్లే,
దర్శకత్వం:
బోయపాటి
శీను.