ఆరక్షణ్ సినిమాపై మాయావతి నిషేధం
అమితాబ్, సైఫ్ అలీఖాన్, దీపికా పడుకొనే, మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రధారులుగా, ప్రకాష్ ఝా దర్శకత్వంలో రూపొందిన 'ఆరక్షణ్" సినిమాఃపై ఉత్తరప్రదేశ్ లోని మాయావతి ప్రభుత్వం నిషేదం విధించింది. ఈ మేరకు ఆగస్టు 10 న ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
భారత దేశ విద్యా వ్యవస్థలో కుల పరమైన రిజర్వేసన్లు అనే అంశం ఈ సినిమాలో ప్రస్తావించడం, శాంతి భద్రతలకు విఘాతం కలింగే విధంగా కొన్ని డైలాగులు ఉండటంతో ఈ సినిమాపై నిషేదం విధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే....ఈ సినిమా నిర్మాత తనకు డబ్బులు బకాయి ఉన్నాడు, అవి చెల్లించే వరకు సినిమా విడుదల ఆపి వేయాలంటూ ఓ వ్యక్తి మద్రాసు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఆగస్టు 12న విడుదల కావాల్సిన ఈ సినిమాపై స్టే విధించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











