Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అల్లు అర్జున్ కోసం ఏడాది పాటు కష్టపడి.. క్యూలో క్రేజీ దర్శకులు!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, రాధాకృష సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరిలోనే ఈ చిత్రానికి ప్రకటన జరిగింది. కానీ ఇంతవరకు సెట్స్ పైకి వెళ్లలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా కథపై కసరత్తు చేస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు ప్రకటిస్తామని చిత్రయూనిట్ తాజాగా తెలిపింది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ సైలెంట్గా తన తదుపరి ప్రాజెక్ట్స్ని సెట్ చేసుకుంటున్నాడు.
హ్యాట్రిక్ కాంబినేషన్
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం రాబోతోంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు మంచి విజయం సాధించాయి. నా పేరు సూర్య చిత్రం నిరాశపరిచిన తర్వాత బన్నీ మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. త్రివిక్రమ్ దర్శత్వంలో తెరకెక్కే చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అభిమానులకు ఈ సారి మంచి చిత్రాన్ని అందించాలని బన్నీ పట్టుదలతో ఉన్నాడు.
సుకుమార్ దర్శత్వంలో
త్రివిక్రమ్ దర్శత్వంలో చితం పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. సుకుమార్, బన్నిలది కూడా హ్యాట్రిక్ కాంబినేషనే. రంగస్థలం లాంటి భారీ విజయం తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. అల్లు అర్జున్ చేతిలో ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ఉన్నాయి.
‘మీ టూ' నటుడిపై కన్నేసిన త్రివిక్రమ్.. అల్లు అర్జున్ కోసం కొత్త విలన్ అతనేనట!
ఎంసీఏ దర్శకుడితో
నాపేరు సూర్య చిత్రం నిరాశపరిచిన తర్వాత అల్లు అర్జున్ కొందరు కొత్త దర్శకులు చెప్పే కథలని సైతం వింటున్నాడు. ఎంసీఏ, ఓమై ఫ్రెండ్ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు శ్రీరామ్ ఇటీవల అల్లు అర్జున్ ని కలసి ఓ కథ వినిపించాడట. వేణు శ్రీరామ్ ఈ కథని ఏడాది పాటు కష్టపడి బన్నీ కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వేణు శ్రీరామ్ వినిపించిన స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉండడంతో అల్లు అర్జున్ వెంటనే అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.
దిల్ రాజు నిర్మాణంలో
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ కుమార్ కూడా బన్నీని మెప్పించే కథని సిద్ధం చేస్తున్నాడట. అల్లు అర్జున్ కోసం ఇలా దర్శకులు వరుసగా క్యూ కడుతున్నారు.