twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్ళు టెర్రరిస్టుల కన్నా డేంజర్:వర్మ

    By Staff
    |

    Ram Gopal Varma
    అదేమన్నా పిక్నిక్ ప్లేసఅనుకున్నాడా లేక షూటింగ్ లొకేషన్ అనుకున్నాడా అంటూ మీడియాలో వర్మ తాజ్ సందర్శన పై విమర్శలు గుప్పుమన్నసంగతి తెలిసిందే. అయితే వర్మ వీటిని తన బ్లాగ్ లో సమాధానం ఇవ్వటం ద్వారా తీవ్రంగా తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా మొదటనుంచీ మీడియాకు వర్మకూ చుక్కెదురే. అందుకే తాజగా ఆయన రణ్ అనే సినిమాని సైతం మీడియాకి వ్యతిరేకంగా రూపొందించటానికి నడుంబిగించారు.

    అయితే ఈ తరుణంలోనే వర్మ ముంబయి తీవ్రవాదుల దాడుల్లో ధ్వంసమైన తాజ్ హోటల్ ని చూడ్డానికి వెళ్ళి సంచలనం సృష్టించి మహారాష్ఠ్ర ప్రభుత్వం కూలిపోవటానికి కారణమయ్యారు. అయితే దాన్ని మీడియా విపరీతంగా హైప్ చేస్తోందంటూ వర్మ విరుచుకు పడుతున్నాడు. అంతేగాక మీడియా వాళ్ళు కూడా ఒక రకంగా టెర్రరిస్టులేనంటూ మండిపడుతున్నాడు.నిరాయుధులైన వారిపై తీవ్రవాదులు దాడి చేసి శారీరకంగా చంపితే...మీడియా వారు మైండ్ పై ఎటాక్ చేసి స్పిరిట్ ని చంపేస్తారు. ఏం ఎవరికి అవకాశమొస్తే ఎవరు వెళ్ళరు..ఎవరికి అలాంటి ప్రాంతాన్ని చూడాలని ఉండదు అంటున్నాడాయన.ఓ భారతీయుడుగా నాకు అక్కడికి వెళ్ళి చూడాలని పించింది వెళ్ళాను. అంతే. అంతేగానీ విలాసరావు కొడుకు రితీష్ తో నాకు సినిమా చేయాలనే అలోచన లేదంటున్నాడు. అదీ సంగతి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X