Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ ఖలేజా..మరో కొమరం పులి అవ్వాలని శాపనార్థాలు పెట్టిన మీడియా...
ప్రిన్స్ మహేష్ బాబు తన 'ఖలేజా" చిత్రం ఆడియోను వినూత్నంగా ఆవిష్కరించాలనుకుని ఆ కార్య క్రమాన్ని హైదరాబాదులోని రేడియో మిర్చి స్టేషన్ లో ఏర్సాటు చేయించారు. ముందుగా 'మిర్చి" లోకి ప్రవేశించిన మహేష్,'మిర్చి" శ్రోతలతో పిచ్చాపాటిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన వెంట దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఉన్నారు. ఇంతలో ఆడియో విడుదల కార్యక్రమంలోసం ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్ సైట్ మీడియా ప్రతినిధులు మిర్చి ఆఫీసు వద్దకు చేరుకున్నారు. అయితే వీరిని కార్యాలయం సిబ్బంది లోనికి ప్రవేశించకుండా అడ్డుకున్నది. ఇంతలో చిత్ర నిర్మాత శింగనమల రమేష్ వచ్చారు. ఆయన లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయనను సైతం అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన రమేష్ తన కారులో తిరిగి వెళ్లిపోయారు.
అయితే మీడియా ప్రతినిధులు మాత్రం ఆడియో విడుదల కార్యక్రమ వివరాలకోసం సుమారు గంటన్నరపాటు మిర్చి ఆఫీసు ముందే వేచి చూశారు. అయితే చివరికి ఏదో ఒకరిద్దరిని లోపలికి మహేష్ ఆహ్వానించారనీ, అయితే ఆ ఇద్దర్నీ చూసిన మహేష్ ఎవరూ రాలేదంటూ తిరిగి వెళ్ళిపోయారు. మీడియా ప్రతినిధులు ఆయనను కలవాలని ఎంత ప్రయత్నించినా మహేష్ వెళ్లిపోయాడు. దాంతో ఆగ్రహించిన మీడియా ప్రతినిధులు మహేష్ ఖలేజా..మరో కొమరం పులి అవుతుందని శాపనార్థాలు పెట్టారు. మహేష్ బాబు పట్టిపులేని ధోరణి వల్లే ఇదంతా జరిగిందని వారు విమర్శించారు. అయితే బయట ఏం జరిగిందో తనకు తెలియదని మహేష్ చెప్పగా, ఇదంతా కేవలం రేడియో మిర్చి అత్యుత్సాహం వల్లనే జరిగిందని మరికొందరు అంటున్నారు.