twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సూర్య' ఫంక్షన్ లో షాకయిన స్టార్స్ !!

    By Staff
    |

    Surya S/O Krishnan
    సూర్య సన్నాప్ కృష్ణ సినిమా ఆడియా ఫంక్షన్ జరిగి రోజులు గడుస్తున్నా అక్కడ జరిగిన సంఘటనలను ఫిల్మ్ నగర్ వాసులు మర్చిపోలేకపోతున్నారు. దాదాపు ఎక్కడో చోట ఎప్పుడో అఫ్పుడు ఈ టాపిక్ తప్పని సరిగా వస్తోంది. ఇంతకీ ఆ రోజు అంత మర్చిపోలేని సంఘటన ఏం జరిగింది అంటే.. ఆ రోజు ఈ ఫంక్షన్ ని ఐమాక్స్ ధియోటర్ లో గ్రాండ్ గా చేసారు. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఐమాక్స్ సిబ్బంది ప్రెస్ నీ,ఫొటో గ్రాఫర్స్ నీ అవమానించారు. దాంతో ప్రెస్ వారంతా కవరేజ్ చేయకుండా స్ట్రైక్ చేసారు.

    దాంతో ముఖ్య అతిధులుగా వచ్చిన వెంకటేష్,రామ్ చరణ్ తేజ,ప్రియమణి,సూర్య,సమీరారెడ్డి లను ఫొటోలు తీయటానికి ఎవరూ ముందుకు రాలేదు. కొద్ది సేపు పరిస్ధితి ఎవరికీ అర్ధం కాలేదు. ఫంక్షన్ ఫ్రారంభమైనా మీడియా వారిలో స్పందన లేదు.ఇంతలో గౌతమ్ మీనన్ స్టేజీ పై వచ్చి నిలబడినా ఎవరూ పట్టించుకోనట్లే ఊరుకున్నారు. దాంతో విషయం తెల్సుకున్న ఆయన వెంటనే ప్రెస్ వారికి క్షమాపణ చెప్పి నాకు కవరేజి ముఖ్యం దయచేసి ఫొటోలు తీయండని వేడుకున్నారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు.అప్పుడు ఐమాక్స్ వారిని పిలిపించి సారీ చెప్పించి ఒప్పించారు.

    అప్పుడు కెమెరాలు క్లిక్ మన్నాయి. అందరి ముఖాల్లో ఆనందం వెల్లివెరిసింది. అంటే తాము వస్తే వెంటనే ఫ్లాష్ లు,ఆటో గ్రాఫ్ లు,ఇంటర్వూలు ప్రెస్ వారు వెనకపడి మరీ అడుగుతారని భావించిన వారు ఈ సంఘటన తో కొంత వరకూ విషయం అర్ధం చేసుకున్నారని,ప్రెస్ విలువ అర్ధం చేసుకున్నారని అంటున్నారు. ఇదే విషయాన్ని పురస్కరించుకుని ఫిల్మ్ నగర్ వాసులు ప్రెస్ ముఖ్యమా...స్టార్స్ ముఖ్యమా అన్న రీతిలో చర్చలు సాగిస్తున్నారు.దేని గొప్ప దానిదే కదా...ఇండిపెండెంట్ ఏదీ కాదు...

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X