Don't Miss!
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
రామ్ చరణ్ ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ: ఫ్యాన్స్ కంగారు!
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలోని న్యూజెర్సీ లో అక్టోబర్ 15న జరిగే చారిటీ కార్యక్రమానికి హాజరై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంది. అయితే రామ్ చరణ్ ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ ఉండటంతో రామ్ చరణ్ అకస్మాత్తుగా తన యూఎస్ టూర్ రద్దు చేసుకున్నారు.
ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ...'హ్యూమానిటీ యూనైటెడ్ అగైనిస్ట్ టెర్రర్' చారిటీ ఈవెంటుకు హాజరు కాలేక పోతున్నాను. ఒక మంచి ఉద్దేశ్యంతో నిర్వమిస్తున్న ఈవెంటులో పెర్పార్మెన్స్ ఇవ్వడానికి ఎంతో ఆతృతగా ఎదరు చూసాను. కానీ ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ ఉండడం వలన హాజరు కాలేకపోతున్నాను. నిర్వహకులకు ఆల్ ది బెస్ట్ అంటూ ఆయన ఎఫ్బిలో పోస్టు చేసారు.
అయితే రామ్ చరణ్ పోస్టుతో అభిమానులు కంగారు పడుతున్నారు. మెగా ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ ఎవరికి? చెర్కీ తన అమెరికా టూర్ రద్దుచేసుకునేంతగా ఎవరు అనారోగ్యం పాలయ్యారు? అనే విషయపై క్లారిటీ లేక అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
కాశ్మీరీ పండిట్లపై జరిగిన ఉగ్రవాద దాడుల్లో నష్టపోయినవారిని ఆదుకోవడానికి ఈ చారిటీ కార్యక్రమం ఏర్పాటుచేసారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఈనెల 15న జరుగబోయే ఈవెంట్ లో సినీతారలు పాల్గొని పర్ఫార్మెన్స్ లు చేయనున్నారు. ఈ ఈవెంట్ లో అఖిల్, శ్రీయ, ప్రభుదేవా, మలైకా అరోరా, సోఫీ చౌదరిలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోనాల్డ్ ట్రంప్ హాజరుకాకున్నారు.