Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’
పృథ్వీ, నవీన్చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన హిలేరియస్ ఎంటర్టైనర్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - ''మా చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈమధ్యకాలంలో ఇలాంటి చక్కని ఎంటర్టైనర్ని చూడలేదని, సినిమా చాలా బాగుందని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. అన్నివర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందింది. ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. వసంత్ ఈచిత్రానికి సూపర్హిట్ మ్యూజిక్ని ఇచ్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్లోనే ఈ చిత్రాన్ని వరల్డ్వైడ్గా విడుదల చేయాలని ప్లాస్ చేస్తున్నాం'' అన్నారు.