Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
మీరాచోప్రా మూన్నాళ్ల ముచ్చట
బంగారం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మీరా చోప్రా చాలా విరామం తర్వాత జగన్మోహిని చిత్రంలో యువరాణిలా నటిస్తోంది. బంగారం, వాన, చిత్రాల తర్వాత మంచి అవకాశాలు లేక, తమిళ ఇండ్రస్ట్రీలో కాలు మోపింది అక్కడ కూడా చేదు అనుభవం ఎదురుకావడంతో సినిమా ఇండస్ట్రీపై విసుగు చెంది ఇకపై సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకుందని సమాచారం అందుతోంది. ఇదే నిజమైతే జగన్మోహిని మీరాచోప్రాకి చివరి చిత్రం అవుతుంది.
ఈ మధ్య ఎక్స్ పోజింగ్ సైతం సై అంటూ హాట్ హాట్ గా కనిపించినా లాభం లేకపోయిందని ఆలస్యంగా తెలుసుకొన్నదికాబోలు. అందుకే సినిమాలకు స్వస్తి చెప్పాలని అనుకొంటున్నట్టు సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇటీవల సినిమాలో హీరోయిన్ గా మీరాచోప్రాను బుక్ చేసుకునేందుకు ఓ నిర్మాత ప్రయత్నించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సినిమా లో అవకాశాలు లేవని కలత చెందక తన దృష్టిలో సినిమానే ప్రపంచం కాదు. దాన్ని మించిన లోకం చాలా పెద్దది అంటూ భారీ డైలాగులు చెబుతోంది. దాంతో విదేశాలలో హొటల్ బిజినెస్ కలిగిన మీరాచోప్రా ఇండియాలోనూ ఆ వ్యాపారాన్ని విస్తరించాలని ప్రణాళికలు సిద్ద చేసుకొంటోందట. ఈ అందాల భామాకు డిల్లీలో 'మిరాజ్" పేరిట ఒక హూటెల్ ను ప్రారంభించిందంటా. మరి మీరా అదృష్టం బిజినెస్ రంగంలో ఎంత వరకో వేచిచూడాలి?!