Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
మీరా జాస్మిన్ తెలుగు ప్రేక్షకులను భయపెడుతుందా?
హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ ‘365 డేస్' చిత్రాన్ని నిర్మించిన యంగ్ ప్రొడ్యూసర్ డి.వి.వెంకటేష్ నిర్మాతగా డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్ పై మీరాజాస్మిన్ ప్రధానపాత్రలో నటించిన మలయాళ చిత్రాన్ని‘ది ఐస్' అనే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రానికి షాజియం దర్శకుడు. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా... చిత్ర నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ ‘పందెంకోడి, గుడుంబా శంకర్, అమ్మాయి బాగుంది వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ ముద్దుగుమ్మ మీరాజాస్మిన్ పెళ్లికి ముందు నటించిన మలయాళ చిత్రమిది. హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ చిత్రంగా మంచి కలెక్షన్స్ ను సాధించింది. ఈ చిత్రం తర్వాత ఆమె వేరే చిత్రాల్లో నటించలేదు.
ప్రస్తుతం ఈ చిత్రాన్ని ‘ది ఐస్' అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం సినిమా రీరికార్డింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. నేను ఈ చిత్రాన్ని చూడగానే నాకు బాగా నచ్చింది. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందనిపించింది, అందుకే ఈ చిత్ర రైట్స్ ను కొని తెలుగులో విడుదల చేస్తున్నాను. అంతే కాకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మ్యూజిక్ డైరెక్టర్ కనిష్క సహాయంతో రీరికార్డింగ్ ను కొత్తగా చేయిస్తున్నాను అన్నారు.
షాజియం ఒక మంచి పాయింట్ తో ఇంతకు ముందు చెప్పిన విధంగా హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో సినిమాని తెరకెక్కించారు. అలాగే ఈ ఆగస్ట్ 26న ఈ సినిమా ఆడియో కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని సెప్టెంబర్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మీరా జాస్మిన్ నటన హైలైట్ గా నిలుస్తుంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. అలాగే మా బ్యానర్ లో వంశీగారి దర్శకత్వంలో రూపొందిన ‘మెల్లగా తట్టింది మనసు తలుపు' చిత్రాన్ని సెప్టెంబర్ 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.