Don't Miss!
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- News చంద్రబాబు బచ్చా కామెంట్ కు జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇలా...!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
చిరుకి గానీ ఆయన ఫ్యామిలీకి గానీ వాటితో ఎలాంటి సంబంధం లేదు.. క్లారిటీ ఇస్తూ ప్రెస్ నోట్
ఇన్నాళ్లు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లాంటి పలు సామాజిక సేవా సంస్థలు నడిపిస్తూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే విద్యా వ్యవస్థ లోకి అడుగు పెడుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఓ పాఠశాలను ఆయన ప్రారంభించబోతున్నట్లు వార్తలు రాసుకొచ్చారు. అయితే దీనిపై క్లారిటీ ఇస్తూ తాజాగా ప్రెస్ నోట్ విడుదల చేశారు మెగా అభిమానులు.
|
చిరంజీవి ఫ్యామిలీకి సంబంధం లేదు
చిరంజీవికి గానీ, రామ్ చరణ్ కి గానీ, నాగబాబుకి గానీ ఈ విద్యాసంస్థలతో ఎటువంటి సంబంధం లేదని ఈ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. చిరంజీవి అభిమానులమైన తాము సేవా దృక్పధంతో, సామాజిక స్పృహతో చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరిట విద్యాసంస్థను స్థాపిస్తున్నామని తెలిపారు.
దిగువ తరగతి ప్రజలకు మేలు కలగాలని
కార్పొరేట్ కల్చర్ బాగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో దిగువ, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ విద్య అనేది అందని ద్రాక్ష అయింది. బోలెడు ఫీజులు చెల్లించి కార్పొరేట్ విద్య అందించలేక ఎంతో మంది తల్లిదండ్రులు నిరాశ చెందుతున్నారు. ఈ వెలితిని తీర్చేందుకే మా చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించబోతున్నామని వారు అన్నారు.
తక్కువ ఫీజులు.. మెగా కుటుంబంపై అభిమానంతో
తమకు మెగా కుటుంబంపై ఉన్న అభిమానంతోనే ఈ విద్యాసంస్థను ప్రారంభిస్తున్నామని, దీనికి చిరంజీవి గారిని, రామ్ చరణ్ గారిని, నాగబాబు గారిని గౌరవ ఫౌండర్లుగా, గౌరవ అధ్యక్షులుగా మియమించుకున్నామని పేర్కొంటూ.. ఈ విద్యాసంస్థ ద్వారా దిగువ, మధ్య తరగతి విద్యార్థులకు తక్కువ ఫీజులకే విద్యనందిస్తామని తెలిపారు. తమ యొక్క ఈ చిరు ప్రయత్నానికి మీ అందరి సహకారం కావాలని ఈ సందర్బంగా వారు అభ్యర్థించారు.
మెగాస్టార్ చిరంజీవి
చిత్రసీమలోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, సుదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రాన్ని అక్టోబర్ 2 తేదీన విడుదల చేయనున్నారని తెలుస్తోంది.