Don't Miss!
- News సీఎం పదవి ఊడిపోతుంది, మేము కొట్లాడుకుంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈగనోడి !
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
చిరుకి గానీ ఆయన ఫ్యామిలీకి గానీ వాటితో ఎలాంటి సంబంధం లేదు.. క్లారిటీ ఇస్తూ ప్రెస్ నోట్
ఇన్నాళ్లు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లాంటి పలు సామాజిక సేవా సంస్థలు నడిపిస్తూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే విద్యా వ్యవస్థ లోకి అడుగు పెడుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఓ పాఠశాలను ఆయన ప్రారంభించబోతున్నట్లు వార్తలు రాసుకొచ్చారు. అయితే దీనిపై క్లారిటీ ఇస్తూ తాజాగా ప్రెస్ నోట్ విడుదల చేశారు మెగా అభిమానులు.
|
చిరంజీవి ఫ్యామిలీకి సంబంధం లేదు
చిరంజీవికి గానీ, రామ్ చరణ్ కి గానీ, నాగబాబుకి గానీ ఈ విద్యాసంస్థలతో ఎటువంటి సంబంధం లేదని ఈ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. చిరంజీవి అభిమానులమైన తాము సేవా దృక్పధంతో, సామాజిక స్పృహతో చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరిట విద్యాసంస్థను స్థాపిస్తున్నామని తెలిపారు.
దిగువ తరగతి ప్రజలకు మేలు కలగాలని
కార్పొరేట్ కల్చర్ బాగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో దిగువ, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ విద్య అనేది అందని ద్రాక్ష అయింది. బోలెడు ఫీజులు చెల్లించి కార్పొరేట్ విద్య అందించలేక ఎంతో మంది తల్లిదండ్రులు నిరాశ చెందుతున్నారు. ఈ వెలితిని తీర్చేందుకే మా చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించబోతున్నామని వారు అన్నారు.
తక్కువ ఫీజులు.. మెగా కుటుంబంపై అభిమానంతో
తమకు మెగా కుటుంబంపై ఉన్న అభిమానంతోనే ఈ విద్యాసంస్థను ప్రారంభిస్తున్నామని, దీనికి చిరంజీవి గారిని, రామ్ చరణ్ గారిని, నాగబాబు గారిని గౌరవ ఫౌండర్లుగా, గౌరవ అధ్యక్షులుగా మియమించుకున్నామని పేర్కొంటూ.. ఈ విద్యాసంస్థ ద్వారా దిగువ, మధ్య తరగతి విద్యార్థులకు తక్కువ ఫీజులకే విద్యనందిస్తామని తెలిపారు. తమ యొక్క ఈ చిరు ప్రయత్నానికి మీ అందరి సహకారం కావాలని ఈ సందర్బంగా వారు అభ్యర్థించారు.
మెగాస్టార్ చిరంజీవి
చిత్రసీమలోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, సుదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రాన్ని అక్టోబర్ 2 తేదీన విడుదల చేయనున్నారని తెలుస్తోంది.