Don't Miss!
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాలయ్య ఫ్యాన్స్కు మెగా ఫ్యాన్స్ థాంక్స్
నెల్లూరు: మెగాస్టార్ అభిమానులు, బాలకృష్ణ అభిమానుల మధ్య తరచూ ఏదో ఒక వివాదం చెలరేగడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా నందమూరి, మెగా హీరోల సినిమాల రిలీజుల సమయాల్లో కొన్ని సందర్భాల్లో గొడవలు కూడా జరిగాయి. ఆ మధ్య కలెక్షన్ల విషయంలో ఇరు వర్గాల అభిమానులు ప్లెక్సీల వార్కు దిగిన విషయం విధితమే.
అయితే... తాజాగా నెల్లూరులో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మోగా అభిమానులు బాలకృష్ణ అభిమానులకు థాంక్స్ చెప్పారు. ఆశ్యర్యానికి గురిచేస్తున్న ఈ రేర్ సంఘటన వివరాల్లోకి వెళితే..... ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులంతా రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానం చేసిన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో కొన్ని వేల యూనిట్ల బ్లడ్ను డొనేట్ చేసారు మెగా ఫ్యాన్స్.
కాని బ్లడ్ బ్యాంక్ ఉద్యోగులు కొందరు అభిమానుల రక్తాన్ని డబ్బులకు ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్ముకోవడానికి ప్రయత్నించడంతో బాలయ్య అభిమానులు పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు బాలయ్య అభిమానులకు థాంక్స్ చెప్పినట్లు సమాచారం.
ఏది ఏమైనా ఇలా ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఇలా కలిసి పోవడంపై ఇటు సినీ వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. భవిష్యత్లో కూడా ఇరు వర్గాల అభిమానులు కలిసి ఉండాలని, ఏ హీరో సినిమా విడుదలైనా ఆదరించాలని, సినీ పరిశ్రమ పచ్చగా ఉండాలని అంతా కోరుకుంటున్నారు.