Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
మేఘా హీరో కొత్త సినిమా ప్రారంభం, ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమాలో నటించబోతున్నారు!
ఘాజీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సంకల్ప్ రెడ్డి తన మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. రానా ప్రధాన పాత్రలోసంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఘాజీ చిత్రం టాలీవుడ్లోనే కాకుండా ఇతర భాసల్లో ప్రేక్షకులను మెప్పించడం జరిగింది. తాజాగా ఈ సినిమాను నేషనల్ అవార్డ్ లభించడం తెలుగు ప్రేక్షకులకు గర్వకారణం.
ఈ డైరెక్టర్ తన రెండో సినిమాను హీరో వరుణ్ తేజ్ తో చేయ్యబోతున్నడనే అనే విషయం చాలా రోజుల నుండి తెలుసు. ఈరోజు ఉదయం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో లో ఈ సినిమా ప్రారంభం అయ్యింది. తోలి షాట్ కు నాగబాబు క్లాప్ కొట్టడం జరిగింది. శేఖర్ సినిమాటోగ్రఫి అందిస్తోన్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నాడు.
రంగస్థలం సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన రామకృష్ణ ఈ సినిమాకు పని చేయ్యబోతుండడం విశేషం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉండబోతోందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియో లో వేసిన భారి సెట్స్ లో సినిమా కొంతభాగం చిత్రీకరించబోతున్నారు. లావణ్య త్రిపాటి, అతిధి రావ్ హైద్రి ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించబోతున్నారు.