Don't Miss!
- News జగన్కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎన్టీఆర్ ఫొటోతో నందమూరి అభిమానులను ఆకట్టుకున్న మెగా హీరో!
జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డేకు ఇంకా 10రోజులు సమయం ఉన్నప్పటికీ అప్పుడే అభిమానుల్లో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. కామన్ డీపీలతో తారక్ బర్త్ డేను ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. అభిమానులే కాకుండా సినీ తారలు కూడా జూనియర్ ఎన్టీఆర్ పై వారికున్న అనుబంధాన్ని గురించి చెబుతూ తారక్ స్పెషల్ ఫోటోని షేర్ చేస్తున్నారు.
ఇప్పటికే కాజల్ అగర్వాల్, థమన్, దేవి శ్రీ ప్రసాద్ వంటి స్టార్ యాక్టర్స్, టెక్నీషియన్స్ తారక్ బర్త్ డే డీపీని షేర్ చేశారు. ఇక ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తారక్ తో ఉన్న అనుబంధం గురించి వివరించాడు. "గత 12 ఏళ్ల నుంచి అతనితో పటిష్టమైన స్నేహాన్ని ఏర్పరచుకున్నాను.
తారక్ కోసం మరో పేరు.. కాజల్ అగర్వాల్ ఏమని పిలుస్తుందో తెలుసా?
నా వరకు అతను సాధారణంగా ఉండే మానవత్వం కలిగిన వ్యక్తి. కానీ చాలా మందికి అతను హీరో కంటే ఎక్కువ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే" అంటూ సాయి ధరమ్ తేజ్ పాజిటివ్ గా తారక్ తో తనకున్న అనుబంధం గురించి పేర్కొన్నాడు.
అలాగే అభిమానుల కోసం కామన్ డీపీని లాంచ్ చేసి నందమూరి అభిమానుల మనసుల్ని కూడా గెలుచుకున్నారు ఈ మెగా హీరో. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో సిద్ధమవుతున్నాడు. లాక్ డౌన్ కారణంగా విడుదల తేదీని వాయిదా వేసుకున్న ఆ సినిమా సమ్మర్ ఎండింగ్ లో పరిస్థితులను బట్టి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. చివరగా సాయి మారుతి దర్శకత్వంలో 'ప్రతి రోజు పండగే అనే సినిమా చేసి హిట్టు కొట్టిన విషయం తెలిసిందే.