మెగా హీరోల కబ్జాగిరి...వారంతా విలవిల!

కాగా....పరిశ్రమలో మెగా హీరోల కబ్జాగిరీ నడుస్తోందని కొందరు వాదిస్తున్నారు. ఈ హీరోలు వరుస పెట్టి సినిమాలు విడుదల చేస్తుండటం, తమ సినిమాల విడుదల సందర్భంగా భారీ సంఖ్యలో థియేటర్లను చరపట్టడంతో చిన్న సినిమాలకు తగిన సంఖ్యలో సరైన థియేటర్లు దొరకడం లేదని, దీని వల్ల తీవ్రం నష్టం వాటిల్లుతోందని అంటున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం సందర్భంగా దాదాపు వెయ్యి థియేటర్లు రిజర్వ్ చేసుకున్నాడు. రాబోయే రెండు నెలలను కూడా మెగాహీరోలే కబ్జా చేసారు. ఎవడు సినిమా జులై చివరి వారంలో విడుదలకు సిద్ధం అవుతోంది.
ఎవడు సినిమా విడుదలైన మరికొన్ని రోజులకే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న 'అత్తారింటికి దారేది' చిత్రం ఆగస్టులో విడుదలకు సిద్ధం అవుతోంది. దీని తర్వాత సెప్టెంబర్ నెలలో చరన్ నటించిన బాలీవుడ్ మూవీ తెలుగులో 'తుఫాన్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలు భారీగా థియేటర్లను దక్కించుకునే ప్రయత్నం ఇప్పటి నుండే మొదలైంది.


Click it and Unblock the Notifications











