Don't Miss!
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
మెగా హీరోల కబ్జాగిరి...వారంతా విలవిల!
కాగా....పరిశ్రమలో మెగా హీరోల కబ్జాగిరీ నడుస్తోందని కొందరు వాదిస్తున్నారు. ఈ హీరోలు వరుస పెట్టి సినిమాలు విడుదల చేస్తుండటం, తమ సినిమాల విడుదల సందర్భంగా భారీ సంఖ్యలో థియేటర్లను చరపట్టడంతో చిన్న సినిమాలకు తగిన సంఖ్యలో సరైన థియేటర్లు దొరకడం లేదని, దీని వల్ల తీవ్రం నష్టం వాటిల్లుతోందని అంటున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం సందర్భంగా దాదాపు వెయ్యి థియేటర్లు రిజర్వ్ చేసుకున్నాడు. రాబోయే రెండు నెలలను కూడా మెగాహీరోలే కబ్జా చేసారు. ఎవడు సినిమా జులై చివరి వారంలో విడుదలకు సిద్ధం అవుతోంది.
ఎవడు సినిమా విడుదలైన మరికొన్ని రోజులకే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న 'అత్తారింటికి దారేది' చిత్రం ఆగస్టులో విడుదలకు సిద్ధం అవుతోంది. దీని తర్వాత సెప్టెంబర్ నెలలో చరన్ నటించిన బాలీవుడ్ మూవీ తెలుగులో 'తుఫాన్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలు భారీగా థియేటర్లను దక్కించుకునే ప్రయత్నం ఇప్పటి నుండే మొదలైంది.