Don't Miss!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆయన సైరా చూసుంటే.. శభాష్ రా, బాగా చేశావురా అనేవారు.. చిరంజీవి ఎమోషనల్
మెగాస్టార్ చిరంజీవి తాడేపల్లిగూడెంలో మహానటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయమే హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకొని.. అక్కడి నుంచి తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన 9అడుగుల 3అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని అవిష్కరించారు. ఈ సందర్భంగా భావోద్వేగంతో చిరంజీవి మాట్లాడుతూ..
నేను సినిమాల్లోకి రావడానికి
నేను సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తినిచ్చిన నా అభిమాన నటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా నాన్నగారికి సినిమాలో నటించాలనే కోరిక ఉండేది. నాటక రంగం నుంచి వెళ్లి ఎస్వీ రంగారావుతో కలిసి జగత్ జెంత్రీలు, జగత్ కిలాడీలు లాంటి సినిమాలో నటించాడు. అప్పుడు నాకు మా నాన్న గారు ఎస్వీ రంగారావు గురించి చెప్పేవారు. అలా ఆయన నా అభిమాన నటుడిగా మారారు అని చిరంజీవి చెప్పారు.
ఎస్వీ రంగారావు డైలాగ్ డెలివరీ
ఎస్వీ రంగారావు డైలాగ్ డెలీవరి నాకు బాగా నచ్చుతుంది. కరకరా అప్పడాలు నమిలే విధంగా డైలాగ్స్ చెప్పాలని రావుగోపాలరావుకు సలహాలు ఇచ్చారట. అదే విషయం ఆయనను మహానటుడిగా మార్చేలా చేసేందనుకొంటాను. మహానటుడు ఎవరంటే ఎస్వీ రంగారావు, మహానటి అంటే సావిత్రి అని చెబుతాను అని చిరంజీవి అన్నారు.
ఎస్వీ రంగారావు తెలుగువాడిగా పుట్టడం
ఎస్వీ రంగారావు తెలుగువాడిగా పుట్టడం ఆయన దురదృష్టం. హాలీవుడ్లో పుట్టి ఉంటే గొప్ప యాక్టర్ అయ్యేవారు. ఆయన నటనకు తెలుగు అనే హద్దు పెట్టాం. అయినా ఆయన నటన ప్రతిభకు జకర్తాలో అంతర్జాతీయ అవార్డు లభించింది. అలా తెలుగు వాడైనందుకు మన అదృష్టం. అలాంటి నటుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చిరంజీవి పేర్కొన్నారు.
ఆయన సైరా చూసి ఉంటే
ప్రస్తుతం చరిత్ర ఆధారంగా సైరా సినిమా చేయడం, మరుగున పడిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి సినిమాను సైరా నర్సింహరెడ్డి తీసి అందరి ప్రేక్షకాదరణను మూటగట్టుకొన్నాను. అందుకు చాలా రుణపడి ఉంటాను. నేను ఇండస్ట్రీకి వచ్చేసరికి మహానటుడు ఎస్వీ రంగారావు లేరు. ఆయన ఈ రోజు ఉండి ఉండే.. సైరా చూసి శభాష్ రా.. సినిమాను బాగా చేశావురా అని ఉండేవారేమో. అయినా పైనుంచి ఆయన ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి అని చిరంజీవి అన్నారు.