Don't Miss!
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అద్భుతం రంగస్థలం.. సెట్ను సందర్శించిన మెగాస్టార్..
విభిన్న చిత్రాలను రూపొందించే దర్శకులకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన వారిలో డైరెక్టర్ సుకుమార్ ఒకరు. ప్రస్తుతం ఆయన రాంచరణ్, సమంతతో కలిసి రంగస్థలం అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం మార్చి 30న రిలీజ్కు సిద్ధమవుతున్నది. కాగా హైదరాబాద్లో రంగస్థలం కోసం ప్రతిష్ఠాత్మకంగా వేసిన సెట్ను మెగాస్టార్ చిరంజీవి సందర్శించడం ప్రముఖంగా మారింది.
1985 నాటి కాలపు నాటి కథతో సుకుమార్ రంగస్థలం చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తొలుత గోదావరి జిల్లాలో మారుమూల ప్రాంతంలో చిత్రీకరించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కోసం గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే పల్లెటూరు సెట్ను అద్భుతంగా తీర్చిదిద్దారు. రంగస్థలం పేరుతో ఉండే సెట్ టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సందర్శించి ముచ్చటపడినట్టు సమాచారం.
ఈ సెట్ను రూపొందించిన ఆర్ట్ దర్శకులను ప్రశంసలతో ముంచెత్తారట. అంతేకాకుండా ఖర్చుకు వెనుకాడకుండా రూపొందించిన నిర్మాతలను అభినందించారట.