Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
క్రేజీగా అర్జున్ సురవరం ప్రీరిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా!
యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ సురవరం. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. దర్శకుడు టీఎన్ సంతోష్ ఉత్కంఠ భరిత అంశాలతో రూపొందించారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. మే 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న అర్జున్ సురవరం చిత్రానికి నిఖిల్ అప్పుడే ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించేశాడు. త్వరలో ఈ చిత్రానికి గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిఖిల్ ఆశలు
అర్జున్ సురవరం చిత్రంపై నిఖిల్ ఆశలు పెట్టుకుని ఉన్నాడు. నిఖిల్ నటించిన చివరి రెండు చిత్రాలు కేశవ, కిర్రాక్ పార్టీ నిరాశపరిచాయి. దీనితో అర్జున్ సురవరం చిత్రంతో విజయాన్ని అందుకునేందుకు నిఖిల్ ఏ ఒక్క అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు. కమర్షియల్ చిత్రాలు జోలికి పోకుండా నిఖిల్ విభిన్నమైన కథలు ఎంచుకుంటూ రాణిస్తున్నాడు.
చీఫ్ గెస్ట్ ఎవరంటే
విడుదల సమయం దగ్గర పడుతుండడంతో అర్జున్ సురవరం నిర్మాతలు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాత ఠాగూర్ మధు, చిరంజీవికి మధ్య మంచి రిలేషన్ ఉంది. అర్జున్ సురవరం టీజర్ విడుదలైనప్పుడు కూడా చిరు అభినందించారని నిఖిల్ తెలిపాడు. ప్రస్తుతం చిరంజీవి సైరా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
లావణ్య త్రిపాఠి
అర్జున్ సురవరం చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం లావణ్య త్రిపాఠికి చాలా కీలకం. ఇటీవల ఆమెకు సరైన సక్సెస్ లేదు. లావణ్య చివరగా నటించిన అంతరిక్షం చిత్రం కమర్షియల్ గా రాణించలేకపోయింది. నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించడం ఇదే తొలిసారి.
టైటిల్ వివాదం
నిఖిల్ అర్జున్ సురవరం చిత్రంలో జర్నలిస్ట్ గా ఎలాంటి విన్యాసాలు చేశాడనే విషయం సినిమా విడుదలయ్యాకే తేలనుంది. ఈ చిత్రానికి శామ్ సంగీతం అందిస్తున్నాడు. తరుణ్ అరోరా, వెన్నెల కిషోర్, నాగినీడు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మొదట ముద్ర అనే టైటిల్ ప్రకటించడంతో నిర్మాత నట్టికుమార్ ఆ టైటిల్ నాదంటూ వివాదానికి దిగారు. దీనితో ముద్ర టైటిల్ ని కాస్త అర్జున్ సురవరంగా మార్చారు.