Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మెగాస్టార్ చిరంజీవి గురించి సూటిగా సుత్తి లేకుండా...
హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమపై ఏకచత్రాధిపత్యం కొనసాగించిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. నేటితో ఆయన 58 సంవత్సరాలు పూర్తి చేసుకుని 59వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆగష్టు 22, 1955 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించాడు. చిరంజీవి వివాహం ప్రసిద్ధ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.
చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978 లో పునాది రాళ్లు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కాని ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషకం 1,116 రూపాయలు.
'పునాదిరాళ్ళు"తో చలనచిత్ర రంగప్రవేశం చేసిన మెగాస్టార్... 'ఖైదీ"తో అందరి మనసు దోచాడు. "పసివాడి ప్రాణం"గా పిల్లల ను అలరించాడు. "స్వయంకృషి" తో 'రుద్రవీణ" కు జాతీయ అవార్డు సాధించాడు."మరణమృదంగం" తో మెగాస్టార్ అయ్యాడు. ఈ 'జగదేకవీరుడు" అతిలోకసుందరి తో రాసలీల లాడి,"గ్యాంగ్ లీడరై ' 'రౌడీఅల్లుడు" & 'ఘరానామొగుడు" గా అందరికీ 'ఆపద్భాంధవుడై"నాడు. 'ఇంద్ర"సేనుడి గా విజయఢంకా మ్రోగిస్తూ 'ఠాగూర్" గా చరిత్ర సృష్టించాడు."శంకర్ దాదా MBBS"అంటూ ఆప్యాయత పంచి 'అందరివాడు" గా నిలిచాడు ఈ 'జై చిరంజీవ.
రాజకీయాల కారణంగా గత కొంత కాలంగా సినిమాలకు దూరమైన చిరంజీవి త్వరలో 150వ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 150వ సినిమా కోసం గత కొన్ని రోజులుగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం చిరంజీవి పుట్టిన రోజున నేపాల్ వెళ్లారు. అక్కడే ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు.