twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మలేషియా నుండి ‘రేయ్’ షూటింగ్ తో తిరిగొచ్చిన మెగాస్టార్ మేనల్లుడు..!

    By Sindhu
    |

    చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు వై.వి.యస్.చౌదరి 'రేయ్' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తొలి షెడ్యులు షూటింగ్ మార్చ్ 26 నుంచి ఏప్రిల్ 26 వరకు మలేసియాలో జరిగింది. ముఖ్యమైన సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ ను కూడా అక్కడ షూట్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ కొనసాగిస్తున్నారు. వచ్చే నెల 10 నుంచి అమెరికాలో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

    కథ ప్రకారం ఫస్టాఫ్ వెస్ట్ ఇండీస్ లోనూ, సెకండాఫ్ అమెరికాలోనూ జరుగుతుంది. అందుకే ఆయా ప్రాంతాలలో షూటింగ్ చేస్తున్నారు. మ్యూజికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా లవ్ స్టోరీగా రూపొందుతోందని దర్శకుడు చౌదరి చెబుతున్నారు. 'షౌట్ ఫర్ సక్సెస్' అన్నది ఈ సినిమాకి ట్యాగ్ లైన్ గా పెట్టారు. శుభ్ర అయ్యప్ప కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు చౌదరి చెప్పారు. తమ 'బొమ్మరిల్లు వారి' బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    English summary
    Sai Dharam Tej from Chiranjeevi’s family is making his debut into Tollywood. Titled as "Rey", with a tagline ‘shout for success’, the film is taking shape in the hands of YVS Chowdary and apart from wielding the megaphone, he is also producing it on Bommarillu Banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X